తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య విభేదాలు ఏ స్థాయిలో వున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగిన కొన్నాళ్లవరకు మాటలతూటాలతో ఒకరిపై మరొకరు విరుచుకుపడిన ఆ సీఎంలు.. ఇప్పుడు ‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ కేసుల్లో కోర్టు వ్యవహారాలదాకా వెళ్లారు. వీరిద్దరు ఇంతలా పోట్లాడుకుంటుంటే.. తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే సరైన పాయింట్ ని లేవనెత్తారు.
తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని ఆరోపించిన షబ్బీర్ ఆలీ.. దానికి ఓ మంచి ఉదాహరణను కూడా పేర్కొన్నారు. కేసీఆర్ కు సంబంధించిన పత్రిక అయిన ‘నమస్తే తెలంగాణ’లో చంద్రబాబుకు చెందిన ‘హెరిటేజ్’ సంస్థ యాడ్ వచ్చిందని.. మరే ఇతర పత్రికల్లో కూడా ఇంతవరకు ఆ సంస్థ యాడ్ ఇవ్వలేదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇద్దరు మంత్రుల మధ్య ఎటువంటి సంబంధాలు వున్నాయో అర్థమవుతున్నాయని ఆయన అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డ ఆయన.. వారి మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేవని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఏదేమైనా.. షబ్బీర్ అలీ లేవనెత్తిన ఈ ‘యాడ్’ అంశం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒకవేళ ఆ ఇద్దరు సీఎంల మధ్య స్నేహబంధమే వుంటే.. ఇంతగా రాద్ధాంతం ఎందుకు సృష్టిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోనీ.. ఇద్దరి మధ్య ఎటువంటి బంధం లేకపోతే.. బాబు ఎందుకు తన సంస్థ యాడ్ ని కేసీఆర్ కు సంబంధించిన పత్రికకు ఇచ్చారు? అని మరో ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే.. ఆ ఇద్దరు సీఎంలే క్లారిటీ ఇవ్వాల్సి వుంటుంది.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more