వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నామధ్య కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి చర్చలు జరిపిన విషయం గుర్తుండే వుంటుంది. అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతోనూ ఈయన కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా జగన్ బీజేపీ పార్టీ ముఖ్యనేతలతో కలవడాన్ని చూస్తుంటే.. త్వరలోనే తన వైకాపా పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశాలు వున్నాయని వార్తలు వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ కేవలం రూమర్లేనంటూ ఆ పార్టీ నేతలు వాటిని కొట్టిపారేస్తున్నప్పటికీ.. విలీనం వార్తలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి.
బీజేపీ-వైకాపా విలీనంపై వస్తున్న వార్తలేమోగానీ... ఇదే విషయమై కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి మాత్రం తనదైన జోస్యం తెలిపారు. తనపై వున్న అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోవడం కోసం జగన్ కుట్ర పన్నుతున్నారని, బీజేపీలో తన పార్టీని విలీనం చేయాలని జగన్ భావిస్తున్నారని ఆనం విమర్శించారు. ఇప్పటికే అమిత్ షా, రాజ్ నాథ్ తో జగన్ సంప్రదింపులు పూర్తయ్యాయనని, ఇక మిగిలింది మోదీతో మాత్రమేనని ఆనం ఆరోపించారు. మోదీతో కలిసిన అనంతరం జగన్ తన వైకాపా పార్టీని ఖచ్చితంగా బీజేపీలో విలీనం చేస్తారని ఆనం జోస్యం పలికారు. ఇంతేకాదు.. జగన్ మీద ఆయన బాగానే విరుచుకుపడ్డారు.
లక్ష కోట్ల రూపాయలు తిన్న జగన్ ఒక ‘జగజ్జంత్రి’ అని ఆరోపించారు. జగన్ ను జైలు భయం ఇంకా వెంటాడుతూనే వుందని, అందుకే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పటికీ.. ఆ విషయంపై అతను కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నను లేవనెత్తారు. ఒకవేళ అలా కేంద్రాన్ని విమర్శిస్తే.. ఏ కేసు వచ్చి తన మీద పడుతుందోనని, మళ్లీ ఎక్కడా జైలులో కాలక్షేపం చేయాల్సి వస్తుందోనన్న భయంతో వణుకుతున్నారని అన్నారు. ఆయనపై విచారణలో వున్న 40 కేసుల్లో ఏదో ఒకదాంట్లో ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more