తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కాంగ్రెస్ అధిష్టానానికి మాటిచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రకటన చేసి, దాని బిల్లు ప్రక్రియను పూర్తి చేసి అసెంబ్లీకి పంపిన కాంగ్రెస్ అధిష్టానం విలీనం మాటేంటి అని అడిగితే... కాంగ్రెస్ లో పార్టీనీ విలీనం చేసేది లేదు... కావాలంటే పొత్తు పెట్టుకుంటామని చెప్పిన ఆయన ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గి కాంగ్రెస్ నాయకులు అన్నట్లుగానే... అమ్మ ఎలా చెబితే అలానే అంటున్నాడు.
తెలంగాణ విద్యార్థి విభాగం నేతలతో సమావేశం అయిన కేసీఆర్ వారితో అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు ససేమిరా అన్న కేసీఆర్ ఏఐసీసీ అధ్యక్షురాలు మేడమ్ సోనియాగాంధీ ఏం చెబుతుందో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞత చూపించాలని అడిగితే.. చూపిద్దాం అని అన్నారు. మేడమ్ ఎలా అడిగితే అలా కృతజ్ఞత చూపిద్దామని కూడా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మనతో ఏమీ మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించినందుకు.. ఢిల్లీకి వెళ్లి మేడమ్ సోనియాగాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం ఉంది. పార్టీపరంగా కలిసినప్పుడు ఆమె ఏం చెబుతారో చూడాలి. మనం దేనికైనా సిద్ధంగా ఉండాలని చూచించారని అంటున్నారు.
అంటే కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేయమని సోనియా చెబితే కేసీఆర్ సిద్దమేనా ? ఒకవేళ స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని విలీనానికి మొగ్గు చూపితే పార్టీని నమ్ముకున్న టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏమిటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more