టిటిడి చైర్మన్ పదవి విషయంలో మరోమారు భంగపాటుకు గురైన గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. ఎంపి రాయపాటి అనుచరులు గుంటూరులోని ఆయన నివాసానికి చేరుకొని కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత అయిన ఎంపి రాయపాటికి ప్రతిమారు మొండిచేయి చూపుతున్నారని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదంటూ వెంటనే రాజీనామా చేయాల్సిందిగా ఎంపి అనుచరులు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. సీనియర్ నేత అయిన మీకే ఇంతటి అన్యాయం జరుగుతుంటే మాకేం న్యాయం చేస్తారంటూ తెనాలి మాజీ జడ్పీటిసి శాఖమూరి నారాయణప్రసాద్ ఎంపిని ప్రశ్నించారు. అనుచరులు అడిగే ప్రశ్నలన్నింటికీ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎంపి నిర్వేదంగా కూర్చుండిపోయారు. కొద్దిసేపటి అనంతరం తేరుకున్న ఎంపి రాయపాటి తాను సోనియాగాంధీని కలసి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆమెకు వివరిస్తానని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. టిటిడి చైర్మన్ పదవి రానందుకు తనకు ఎటువంటి అసంతృప్తి లేదని, కేడర్ మాత్రం ఆవేదనతో ఉన్నారని అన్నారు. గతంలో టిటిడి చైర్మన్ పదవి భర్తీచేసే సమయంలో వచ్చేమారు తనకు పదవి కేటాయిస్తానని హామీ ఇచ్చారని, తాజా పరిణామాలు తాను అవమానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మొత్తమీద టిటిడి పదవి విషయంలో తాజాగా నెలకొన్న పరిణామాలు రాయపాటి శిబిరంలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more