మన సీఎం కిరణ్ గారు గతంలో కంటే ..ఉప ఎన్నికల తరువాత .. కొత్తగా కనిపిస్తున్నారట. తన వద్ద ఉన్న పాత ఆటలను వదిలేసి ..కొత్త కొత్త ఆటలు .. మంత్రులతో కలిసి ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతే కాకుండా ఢిల్లీ నాయకులతో కూడా కిరణ్ సార్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్తో సమావేశమై రాష్ట్ర రాజకీయాల గురించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. యుపిఏ రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ నామినేషన్ పత్రాల దాఖలు కార్యక్రమానికి హాజరైన కిరణ్కుమార్ రెడ్డి ఆ తరువాత పార్లమెంటు ఆవరణలో ఆజాద్ కార్యాలయానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు గురించి వారు ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడాలంటే నాయకత్వాన్ని మార్చటంతోపాటు పార్టీ పరంగా పలు మార్పులు, చేర్పులు చేయాలంటూ పలువురు నాయకులు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరుతున్న తరుణంలో ఆజాద్తో కిరణ్కుమార్ రెడ్డి జరిపిన సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నదని అంటున్నారు. ఆజాద్తో జరిపిన చర్చల వివరాలను విలేఖర్లకు వెల్లడించేందుకు కిరణ్కుమార్ రెడ్డి నిరాకరిస్తూ, మీరు ఎంత ప్రయత్నించినా నాకు ఎలాంటి ఢోకా లేదంటూ ముందుకు సాగిపోయారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more