మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం పట్ల టీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ విజయశాంతి సంతోషం వెలిబుచ్చారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ రైల్వే లైన్ మంజూరు కోసం తాను ఎంతగానో కృషి చేశానని, చివరికి తన కల ఫలించిందని పేర్కొన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ పొడవు 17కిలోమీటర్లు కాగా ఈ లైన్ నిర్మాణానికి రూ. 114కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు చెప్పారు.
తెల్లాపూర్-పటాన్చెరు ఎంఎంటీఎస్ లైన్కూ కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, ఈ ఎంఎంటీఎస్ మొత్తం పొడవు 9కిలోమీటర్లు కాగా ఈ రైల్వేలైన్ నిర్మాణానికి రూ. 33కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు ప్రధాని, రైల్వే మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రైల్వే ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉన్నందున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపడం తన కనీస బాధ్యత అన్నారు. తాను ఎప్పటికప్పుడు పట్టుదలతో ఫాలోఅప్ చేయడం వల్లే ఈ రెండు రైల్వే ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more