సభ్య సమాజం నివ్వెరపోయేలా పి ల్లలకు మత్తు మందు ఇచ్చి ముష్టెత్తించే ముఠానొకదాన్ని బెంగళూరు లో పోలీసులు కనుగొన్నారు. వీరి బారినుంచి 300 మంది చిన్నపిల్లలను కాపాడటంతో నగరవాసులు నిర్ఘాంతపోయారు. వీరిలో మూడో వంతుమంది మూడేళ్లలోపువారే కావడం విశేషం. చిన్నపిల్లలకు మత్తు మందు ఇచ్చి.. వారి చేత రోజంతా భిక్షమెత్తిస్తారు. కెమేరాను గమనించిన వీరంతా అక్కడ నుంచి పరుగులు తీశారు. కొంచెం వయసున్న పిల్లలను కూడా కెమేరాకు చిక్కకుండా దాక్కోవాలని వాళ్ళు సూచించారు.
పోలీసులు రక్షించిన వారిలో 108 మంది పిల్లలకు చాలాకాలం గా మత్తుమందు ఇస్తున్నట్టు గమనించారు. వీరిలో కొంతమంది రెం డు రోజులుగా మగత నిద్రలోనే ఉండటం పౌరసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బాలల చేత భిక్షమెత్తిస్తున్న ముఠా వెనుక కీలకవ్యక్తులను ఎవరినీ పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. అయితే, బెంగళూరు వీధుల్లో ముష్టి ఎత్తుతున్న 1100 మంది పిల్లలకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పిల్లల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు తొమ్మిది మంది ఉన్నారని అక్రమ రవాణా నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ ఆనంద్ కబ్బూరి తెలిపారు. పిల్లల అక్రమ రవాణాకు, బా లలు వీధుల్లో భిక్షమెత్తడానికి అవినాభావ సంబంధం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more