అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేల పై కాంగ్రెస్ అధిష్టానం వేటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి. జగన్ వర్గం ఎమ్మెల్యేల పై వేటు వేస్తే త్వరలో ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఈ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తానని, తెలంగాణ వాదానికి అనుకూలంగా ఓటు వేస్తానని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించనంత వరకూ కాంగ్రెస్కు కష్టకాలమేనని, ఉప ఎన్నికల్లోనూ పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చని అన్నారు. తెలంగాణ వర్సెస్ నాన్ తెలంగాణ ప్రాతిపదికన ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలో మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న భావన లేదని, అలా ఎవరైనా అనుకుంటే అంతకన్నా పిచ్చోళ్లు ఉండరని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.
తెలంగాణకు ప్రాంతీయ మండళ్లు, ప్యాకేజీలను అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో ఎంపీలంతా ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. తమకు 1956 నాటి హైదరాబాద్తో కూడిన తెలంగాణే కావాలని అధిష్ఠానానికీ చెప్పామన్నారు. డిసెంబర్ 9 నాటి ప్రకటనకు రెండేళ్లు పూర్తయిందని గుర్తుచేస్తూ ప్రధానికి లేఖ కూడా రాశామని చెప్పారు. దీనిపై ఆలోచిస్తున్నామని ప్రధాని, ప్రణబ్ వంటి పెద్దలు మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more