గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రచారాలు ఖండాంతరాలు దాటుతున్న క్రమంలో రాష్ట్రంలోని జిల్లాల్లో జరుగుతున్న పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గుజరాత్ లోని ఖేడా జిల్లాలో ఉన్న ఉన్దేలా గ్రామంలో కొంత మంది ముస్లిం యువకుల్ని పోల్కు కట్టేసి పోలీసులు లాఠీలతో చితక్కొట్టిన విషయం తెలిసిందే.
ఆ ఘటనకు చెందిన వీడియోలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఆ గ్రామంలో జరిగిన గర్భా వేడుకల్లో యువకులు అల్లరి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ప్రజల సమక్షంలోనే వారిని విద్యుత్ స్థంబాలకు కట్టేసి.. వారిపై లాఠీలను జుళిపించారు. ఇద్దరు పోలీసులు వారి చేతులను పట్టుకుని విద్యుత్ స్థంబాలకు ఓ వైపు నుంచి లాగుతుండగా, మరో వైపు యువకులు స్థంబానికి అత్తుక్కపోగా, వారి వెనుక నుంచి మరికోందరు పోలీసులు లాఠీ దెబ్బలను కోట్టారు. ఈ తతంగాన్ని చూస్తున్న అక్కడి జనం చప్పట్లు కొడుతుండాగా ఆ యువకుల్ని చితకబాదారు.
ఈ ఘటన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ ఆశిష్ భాటియా విచారణకు ఆదేశించారు. యువకుల్ని లాఠీలతో కొట్టింది పోలీసులే అని ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, వాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆశిష్ భాటియా తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ ఘటనపై రిపోర్ట్ను పోలీసులకు అందజేయనున్నారు. గుజరాత్లోని ఓ ఎన్జీవో సంస్థ ఈ ఘటన పట్ల రియాక్ట్ అయ్యింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీకి లీగల్ నోటీసులు జారీ చేసింది. బహిరంగంగా యువకుల్ని చితక కొట్టిన ఘటనలో మైనార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ కొందరు ఆఫీసర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులను పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more