అటవీ ప్రాంతంలో వెళ్తున్న సమయంలో ఒళ్లంతా కళ్లు చేసుకుని వెళ్లాలని.. పెద్దలు చెబుతుంటారు. వన్యప్రాణలు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదని, అందుచేత.. చేతిలో కర్ర లేకుండా వెళ్లరాదని కూడా చెబుతుంటారు. కానీ మారుతున్న కాలంతో పాటు అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతికతతో కూడిన సమాజంలో.. మనిషి కేవలం అప్పటి మాటుకు అలోచించి తన అవసరాలు తీర్చుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తున్నాడు తప్ప.. పెద్దలు చెప్పిన మాటలకు ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. దశాబ్దాల కిందట అప్పటివారు అధికంగా నడుచుకుంటూనే ప్రయాణాలు చేసేవారు. అందుకనే కాబోలు ఇలా చెప్పారు.
అయితే కర్ర, చేతి రుమాలు, కండువా లేకుండా అప్పటివారు బయటకు వెళ్లేవారే కాదన్నది సత్యం. ఇక స్కూటర్లు, బైక్ లతో పాటు కార్లు కూడా విపరీతంగా పెరగడంతో కావాల్సిన వారు తమకు అనువైన సాధనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా ఓ వ్యక్తి తన సైకిల్ పై అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తుండగా, అందులోనూ తన గమ్యస్థానానికి వెంటనే చేరుకోవాలని వేగంగా సైకిల్ తొక్కుతూ వెళ్లున్నాడు. ఇలా వెళ్తున్న వ్యక్తి కోసం అక్కడికి కొంచం దూరంలో ఎప్పట్నించి మాటువేసిందో తెలియదు కానీ ఓ చిరుతపులి సైకిలిస్టు సమీపించగానే అతడి వెనుకగా వచ్చిన దాడి చేసింది.
అయితే చిరుత దాడితో సైకిలిస్టు తన బ్యాలెన్స్ కోల్పోయాడు. వెంటనే కింద పడ్డాడు. ఆ తరువాత ఏం జరిగిందోనని వెనక్కు తిరిగి చూసే లోపు అతనికి ఏమీ కనిపించలేదు. ఏదో జరిగిందని అని తనలో తాను భావిస్తూ సైకిల్ ను పైకి లేపి.. మళ్లీ ఒక్కసారి చూశాడు. అతడికి ఓ చిరుతపులి పరిగెడుతూ కనిపించింది. వామ్మో అనుకుని వెంటనే సైకిల్ పైకి ఎక్కడి రోడ్డుకు అటు పైపుగా వచ్చిన మార్గంలోనే తిరుగుపయనం అయ్యాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. కానీ ఏదో జరిగిందన్న అత్రుతతో అతను వేసిన కేకకు రోడ్డుకు అటువైపుగా వెళ్తున్న మరో ఇద్దరు సైకిలిస్టులు ఆగారు.
వారి వద్దకు పరుగు పరుగున వెళ్లి ఆగిన బాధితుడు తనపై చిరుత దాడి చేసిందని చెప్పాడు. అతనిపై దాడి చేసిన సమయంలో ఎక్కడ గాయాలు అయ్యయో కూడా వారికి చూపించాడు. వారు అతడికి ధైర్యం చెబుతూ అక్కడి నుంచి తీసుకెళ్లారు. అస్సాంలోని కజిరంగా పార్క్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి జాతీయ రహదారి 37పై ఒక వ్యక్తి సైకిల్పై వెళ్తున్నాడు. అయితే ఆ రహదారి పక్కగా ఉన్న చెట్ల వద్ద మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా ఆ సైక్లిస్ట్పై దాడి చేసింది. దీంతో సైకిల్పై పట్టుకోల్పోయిన ఆ వ్యక్తి కిందపడ్డాడు. ఈ సంఘటనతో ఆ చిరుత కూడా భయపడి చెట్లలోకి పరుగు తీసింది.
On Dehradun-Rishikesh Highway....
— Susanta Nanda IFS (@susantananda3) September 21, 2022
Both are luckypic.twitter.com/NNyE4ssP19
కాగా, చిరుత దాడితో షాక్కు గురైన ఆ వ్యక్తి వెంటనే కింద పడిన సైకిల్ను పైకి తీశాడు. రోడ్డుకు మరో పక్కగా సైకిల్ తొక్కుతూ అక్కడి నుంచి వెనక్కి వచ్చాడు. సైకిళ్లతో పాటు ఉన్న మరో ఇద్దరి వద్దకు చేరుకున్నాడు. చిరుత దాడిలో తనకు ఏమైనా గాయం అయ్యిందా అని పదే పదే చూసుకున్నాడు. మరోవైపు గతంలో జరిగిన ఈ సంఘటనకు చెందిన పాత వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డెహ్రాడూన్-రిషికేశ్ హైవేపై ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరూ (చిరుత, సైక్లిస్ట్) అదృష్టవంతులని చమత్కరించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా, ఫన్నీగా స్పందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more