తొమ్మిదేళ్ల పాట హాయిగా చట్టాపట్టాలు వేసుకుని తిరగారు. సినిమాలు, షికార్లకు వెళ్లారు. తీరా పెళ్లి చేసుకుందామని అడిగేసరికి.. పెళ్లా.. నీతోనా.? అంటూ ఆటపట్టించినట్టు చేసిన ముఖం మీదే నిర్మోహమాటంగా కుదరదని చెప్పేసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు.. గత తొమ్మిదేళ్లుగా అమెను ప్రేమిస్తూ.. అమె సంతోషం కోసం అమె కోరినవన్నీ సమకూరుస్తూ వచ్చిన యువకుడు.. అమె నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చనిపోతూ ఆ యువకుడు రాసిని మరణవాంగ్మూలం.. కొత్త చర్చకు దారి తీసింది.
ప్రేమికుడితో తిరిగినన్ని రోజులు తిరిగి చివరకు ఇలా చేస్తారా.? అంటూ ఈ సూసైడ్ నోట్ వైరల్ కావడంతో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ సూసైడ్ నోట్ ఏంటీ.? అందులో ఏం రాశాడు.? అంటే.. ఆమె తన జీవితం అనుకునే తాను తన ఆదాయంలో సగానికి పైగా అమెకే ఖర్చుచేశాడు. అమె సంతోషమే తనదిగా భావించాడు. తనకు కాబోయే భార్యకు తాను ఖర్చు చేస్తే తప్పేంటి అనుకున్నాడు. అయితే ఓ మంచి శుభముహూర్తన అమెతో పెళ్లి విషయం మాట్లాడాడు. అంతే అమె నో చెప్పింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు.. అమె కోసం తాను గత తొమ్మిదేళ్లుగా ఎప్పుడు ఎంత ఖర్చుచేసిందీ లెక్క రాసి.. దానిని వసూలు చేయాలని నోట్ లో కోరాడు.
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేయసి పెళ్లికి నిరాకరించడంతో శంకరపురకు చెందిన 31 ఏళ్ల చేతన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ యువతిని తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. సరుకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవించే చేతన్.. ఆమె సరదాలు, సంతోషం కోసం వచ్చిన ఆదాయంలో సగ భాగాన్ని ఖర్చుచేసేవాడు. పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది చేతన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతన్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించిందని, ప్రియురాలి కోసం రూ. 4.50 లక్షలు ఖర్చు చేశానని అందులో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి దానిని తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరాడని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more