తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే ఎలాగైనా తీరుస్తారని గ్రామంలోని పెద్దలు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కానీ ఉన్న ఊరును వదిలేసి జిల్లా కేంద్రంలో ఇళ్లు కట్టుకుని ఉండాలంటే ఎవరు మాత్రం ఎందుకిస్తారు. అక్కడికి వెళ్లిన తరువాత మాట పాయే.. మనిషే కనబడటమూ చాలా అరుదు అవుతుందని వారికి తెలియదా.? ఈ విషయం వారికి అవగతమైంది. దీంతో తామే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు.
తన భార్యపై పూర్తి నమ్మకమున్న ఓ రైతు అమె పేరున అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. అంతే అనుకున్నదే తడవుగా రంగంలోకి అమెను దింపాడు. అంతే తనపై పూర్తి విశ్వాసం, నమ్మకాలను పెట్టుకున్న భర్తను, అతని మాటను వమ్ము చేయడం అమెకు ఇస్టం లేదు. అంతే తన భర్త కోరిక మేరకు మేూడు నెలలుగా కష్టపడుతున్న అమె.. ఎట్టకేలకు విజయం సాధించింది. తన అదృష్టానికి తిరుగులేదని అమె చెప్పకనే చెప్పింది. అదెలా సాధ్యమంటే.. వజ్రాల మైనింగ్ కోసం ప్రయత్నించిన అమె విజయవంతమయ్యారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ. ఈ ఏడాది మార్చిలో మైన్ లీజుకు తీసుకోగా.. తాజాగా 2.08 క్యారెట్ల వజ్రం బయటపడింది.
ఆ వజ్రం విలువ రూ.10 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ పంట పండింది. లీజుకు తీసుకున్న గనిలో 2.08 క్యారెట్ల వజ్రం దొరికింది. పన్నా జిల్లాలోని ఇత్వాకలా గ్రామంలో నివసించే చమేలి బాయి.. కృష్ణ కల్యాణ్పుర్ పాటి ప్రాంతంలో వజ్రాల గనిని లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే లీజుకు తీసుకొని మైనింగ్ ప్రారంభించారు. ఇక్కడే వీరికి ఈ వజ్రం దొరికింది. మంగళవారం పన్నా డైమండ్ ఆఫీస్లో ఈ వజ్రాన్ని అధికారుల వద్ద డిపాజిట్ చేశారు చమేలి బాయి దంపతులు. దీనికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధర నిర్ణయించి త్వరలో వేలం వేస్తారు.
వజ్రం నాణ్యతను బట్టి దీనికి రూ.10 లక్షల వరకు పలకొచ్చని అధికారులు తెలిపారు. వేలంలో వచ్చిన ధర నుంచి పన్నులు, రాయల్టీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని మహిళకు అప్పగిస్తామని చెప్పారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వజ్రాల గనిని లీజుకు తీసుకున్నామని చమేలి భర్త అర్వింద్ సింగ్ చెప్పుకొచ్చారు. వజ్రం దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వజ్రాన్ని వేలం వేసిన తర్వాత వచ్చిన సొమ్ముతో పన్నా నగరంలో ఇల్లు కొనుక్కుంటామని చెప్పారు. పన్నా జిల్లాలోని గనుల్లో 12 లక్షల క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు అధికారుల అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more