మిషన్ చంద్రయాన్ సహా మంగళయాన్ మిషన్లతో చంద్రగ్రహం, గురుగ్రహంపైకికి అంతరిక్ష నౌకలను పంపి ప్రయోగాలను అధ్యయనం చేసిన ఇస్రో.. ఇక తాజాగా శుక్ర గ్రహంపై దృష్టి సారించింది. మన సౌర వ్యవస్థలో సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే రెండో గ్రహం శుక్రుడు(వీనస్). ఈ గ్రహ ఉపరితలంపై సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు కమ్ముకుని ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తాజాగా, ఈ గ్రహంపై ప్రయోగాలకు సిద్ధమవుతోంది. వీనస్ గ్రహ కక్షలో పరిభ్రమించగల అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోంది. దాని ద్వారా ఈ గ్రహం ఉపరితలంపై ఏముంది? ఎలాంటి మూలకాలు ఇక్కడ నిక్షిప్తమై ఉన్నాయనే విషయాలను పరిశోధించాలని అనుకుంటోంది.
ఆ గ్రహం చుట్టూ కమ్ముకుని ఉన్నసల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాల వెనుక దాగిన కారణాలను వెలికి తీయాలనుకుంటోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్దమైందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ వెల్లడించారు. వీనస్ సైన్స్ కు సంబంధించిన సమావేశం అనంతరం సోమ్నాథ్ ఈ ప్రకటన చేశారు. వీనస్ మిషన్కు అవసరమైన నిధుల సేకరణపై కూడా నిర్ణయం జరిగిందన్నారు. ఈ ప్రయోగం విజయవంతం చేయాలని, ఎలాంటి లోటుపాట్లకు అవకాశం కల్పించవద్దని ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన కోరారు. వీనస్ మిషన్ ను ఇస్రో విజయవంతంగా చేపట్టగలదని స్పష్టం చేశారు.
ఈ మిషన్ వీనస్ను 2024 సంవత్సరం డిసెంబర్లో చేపట్టే అవకాశముంది. ఇందుకు సంబంధించి శుక్ర గ్రహ కక్షలో చోటు చేసుకునే మార్పులు మొదలైన వాటిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. 2025లో శుక్ర గ్రహం, భూ గ్రహం కక్షలు సమీపానికి వస్తాయని, ఆ సమయంలో స్పేస్ క్రాఫ్ట్ను శుక్ర గ్రహ కక్షలో ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. అంతరిక్షంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ 2031 వరకు రాదని తెలిపింది. అందువల్ల, ఈ ప్రయోగాన్ని కచ్చితంగా విజయవంతం చేయాలని ఇస్రో పట్టుదలతో ఉంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా శుక్ర గ్రహ వాతావరణాన్ని, ఉపరితలాన్ని పరిశీలిస్తారు. అగ్ని పర్వతాల ఆనవాళ్లు, లావా ప్రవాహ మార్గాలను గుర్తిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more