కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా తిరుమలతిరుపతి శ్రీవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం ఆన్ లైన్ ద్వారానే టికెట్లు పోందిన భక్తులకు మాత్రమే తిరుమలకు చేరుకునేందుకు అనుమతించారు టీటీడీ అధికారులు. ఈ క్రమంలో తమ కొంగుబంగారమైన స్వామిని దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. భక్తులు తిరుమలకు వేలాదిగా చేరుకుని తమ మొక్కలు తీర్చుకుంటున్నారు.ఈ క్రమంలో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లకు భారీ డిమాండ్ నెలకొంది.
దీంతో టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకోగా కొందరు స్పృహ తప్పిపడిపోయారు. సర్వదర్శనం టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్ కూడా స్వల్పంగా దెబ్బతింది. సర్వదర్శనం టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తిరుపతిలోని మూడు చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తుంది. టీటీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ మూడు కౌంటర్ల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. భక్తజనం పెద్దసంఖ్యలో కౌంటర్ల వద్దకు చేరుకుని ఎదురు చూస్తున్నారు.
వేకువ జాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబటంతో ఉదయానికి భక్తుల బారులు కిలోమీటర్ల దూరం చేరుకున్నాయి. గంటల తరబడి టికెట్ల కోసం చూసి విసిగిపోయిన భక్తులు టికెట్ కౌంటర్ వద్దకు భక్తులు తోసుకురావడంతో తోపులాట చోటు చేసుకొంది. ఇక క్యూలైన్ల వద్ద భక్తులు నిలబడేందుకు సరైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేయని కారణంగా ఈ పరిస్థితి నెలకొందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సర్వదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. దీంతో ఇవాళ్టి నుండి సర్వదర్శనం టికెట్లను జారీ చేయడంతో భక్తులు పెద్ద సంఖ్యలో టికెట్ల కోసం పోటీ పడ్డారు.
అయితే భక్తుల మధ్య తోపులాటను కంట్రోల్ చేయడంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తిరుపతి పోలీసులు రంగంలోకి దిగారు. క్యూ లైన్లలో భక్తుల మధ్య తోపులాటతో పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం భక్తుల రద్దీ పెరగడంతో పాలక మండలి నిర్ణయం తీసుకుంది. విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. రేపటి నుంచి ఆదివారం వరకు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి.
(And get your daily news straight to your inbox)
Aug 10 | పేదలకు రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని గర్వంగా చెప్పుకునే దేశంలో.. రూ.20తో జాతీయ జెండాను కొంటే కానీ రేషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన ఘటన సంచలనంగా మారింది. ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్` వేళ... Read more
Aug 10 | దేశవ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో అనేక రాష్ట్రాలు అతలాకులం అయ్యాయి. జనజీవనం స్థంబించింది. రవాణ సదుపాయం తెగిపోయింది. అయితే వర్షం తగ్గిన వెంటనే ఎమర్జెన్సీ డిజార్టర్ సర్వీసెస్ విభాగం అధికారులు ఎక్కడికక్కడ మరమ్మత్తులు... Read more
Aug 10 | ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి చేప పడేవరకు ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు... Read more
Aug 10 | ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా... Read more
Aug 10 | వర్షాకాలం ప్రారంభం నుంచి తన ఉద్దృతిని కొనసాగిస్తున్న వరుణుడు తెలంగాణలో కాసింత ఊరట కల్పించాడు. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలతో సాధారణ వర్షపాతం బదులు అత్యధిక వర్షపాతం నమోదు చేసిన వరుణుడు.. ఎట్టకేలకు... Read more