ఎవరికైనా విమానం చూస్తే ఎక్కాలని, అందులో గగన విహారం చేయాలని భావిస్తుంటారు. అయితే అందుకోసం శ్రద్దగా చదువుకుని మంచి ఉద్యోగం చేయడం ద్వారానో లేక మంచి వ్యాపారవేత్తగా రాణించడం ద్వారానో తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఎదురైన వ్యక్తి మాత్రం మరో టైపు. తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా.. ఏకంగా తన కలలను సాకారం చేసుకుంటూన్నాడు. అదేంటి ఎవరికీ అనుమానం రాకుండా అంటున్నారు. ఏమైనా సంఘవిద్రోహశక్తులతో జతకట్టాడా.? అన్న అనుమానం వస్తోంది కదూ. నిజమేనండీ.. ఇతని పేరు హేమంత్ కుమార్ గుప్తా. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇతని ప్రస్తుతం ఢిల్లీలో నివాసముంటున్నాడు.
విమానంలో హైదరాబాద్కు వచ్చి చైన్స్నాచింగ్ చేసి తిరిగి విమానంలోనే ఢిల్లీ వెళ్లడం అతడి తీరు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో కమల (55) పుస్తెలతాడును లాక్కొని వెళ్లాడు. పుస్తెలతాడు లాగుతున్న సమయంలో కిందపడ్డ ఆమె తలకు బలమైన గాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కదలికలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఎయిర్పోర్టువైపు వచ్చినట్లు తెలియడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలోని పోలీసు ఔట్పోస్టులోని కానిస్టేబుళ్లు శ్రీశైలం, భాను, లింగం విమానాశ్రయంలోని భద్రతాధికారులతో కలిసి అన్ని విమానాల్లో క్షుణంగా తనిఖీలు చేశారు.
బుధవారం తెల్లవారు జామున 5.45 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్జెట్ విమానంలో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇలాంటి తరహాలోనే ఆరు స్నాచింగ్లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రాచకొండ పోలీసులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్జీఐఏ ఔట్పోస్టు కానిస్టేబుళ్లను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఓఎల్ఎక్స్లోచూసి ఎల్బీనగర్కు చెందిన వ్యక్తి నుంచి ద్విచక్రవాహనం కొనుగోలు చేసి అదే వాహనాన్ని వాడి స్నాచింగ్కు పాల్పడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more