ఉక్రెయిన్లోని ఖార్కీవ్ పట్టణాన్ని రష్యా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వారితో పాటు ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. ఖార్కీవ్, సుమే ప్రాంతంలో ఉన్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు 130 బస్సులు సిద్ధంగా ఉన్నట్లు రష్యా రక్షణశాఖ కంట్రోల్ సెంటర్ తెలిపింది. ఆ విద్యార్థులను రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతానికి తరలించనున్నట్లు కల్నల్ జనరల్ మిఖేయిల్ మిజిన్సేవ్ తెలిపారు. ఖార్కీవ్లోని రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు బంధీ అయి ఉన్నట్లు నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన విషయం తెలిసిందే.
ఫైరింగ్ వల్ల ఖార్కీవ్ నుంచి విద్యార్థుల తరలింపు ఆగినట్లు ఇండియా పేర్కొన్న తర్వాత పుతిన్ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా సెక్యూర్టీ కౌన్సిల్లో మాట్లాడిన పుతిన్.. 3179 మంది భారతీయుల్ని బంధీలుగా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఖార్కీవ్లో విద్యార్ధులు చిక్కుకున్న విషయంపై పుతిన్తో బుధవారం ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కీవ్లో భయాంకర దాడులు జరుగుతున్నాయి. ఇరు దేశాల సైనికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యుద్దభూమిలో పోరును కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. విద్యార్థుల తరలింపు కోసం మంత్రి వీకే సింగ్ పోలాండ్ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కీవ్ నగరంలో భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు. కీవ్లో రష్యా సైనికులు జరుపుతున్న కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థిపై ఫైరింగ్ జరిగినట్టు మంత్రి వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు జరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు మంగళవారం రష్యా దాడుల్లో భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more