తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ ఐఏఎస్ల ముఠా ఏలుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డిని సైతం పక్కనబెట్టి బీహార్కు చెందిన అంజనీకుమార్ను ఇన్చార్జ్ డీజీపీగా నియమించారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రంలోని కీలక ఐపీఎస్ స్థానాల్లో బిహార్ కు చెందిన పోలీసు అధికారులనే నియమించారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్నే రేపాయి. అయితే ఈ అరోపణలపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఖండించారు. రాజకీయ లబ్ది కోసం పోలీసు అధికారులను పావులుగా వాడుకోరాదని ఆయన అక్షేపించారు.
తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. తాను ఇంట్లో కాలుజారి పడటంతోనే తనకు ఎడమ భుజానికి గాయమైందని వివరించారు. తన భుజంపైన మూడు చోట్ల ఫ్యా ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు. ఈ విషయం ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టులలో తేలిందని, భుజం కదలకుండా కట్టుకట్టారని అన్నారు. అందుకే తాను ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరతానని వివరించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని అన్నారు. సీనియర్ అధికారిపై ఆరోపణలను చేయడం సరికాదని చెప్పారు.
ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు, వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. మరోవైపు, ఐఏఎస్లను నిందించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని నిందిస్తే వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు ఐఏఎస్లపై చేస్తోన్న ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్లను ఏ రాష్ట్రానికైనా కేటాయిస్తారని తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాంతీయతను అంటగట్టడం వారి మనోభావాలను దెబ్బ తీయడం అప్రజాస్వామికమని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ కూడా తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more