ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకొన్న నేపథ్యంలో.. అమెరికా తదితర దేశాల కూటమి ప్రత్యామ్నాయ చర్యలు ముమ్మరం చేసింది. ఇదే అంశంపై చర్చించేందుకు 193 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేక సమావేశానికి రంగం సిద్ధంచేసింది. ఈ మేరకు 15 సభ్య దేశాల భద్రతా మండలి ఓటింగులో పాల్గొని నిర్ణయం తీసుకున్నాయి. అయితే, భారత్ ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉంది. రష్యా సైనిక చర్యను ఖండిస్తూ భద్రతా మండలిలో చేసిన తీర్మానానికీ భారత్ గైర్హాజరైన విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఇటువంటి అసాధారణ సమావేశాలు గత ఏడు దశాబ్దాల్లో పది సందర్భాల్లో మాత్రమే జరిగాయి.
‘‘ఉక్రెయిన్-రష్యా వివాదంపై భద్రతా మండలి ఇటీవల భేటీ అయిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారడం విచారకరం. దౌత్యమార్గాలు, చర్చలు తప్ప మరో మార్గం లేదు. బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు ఇరు దేశాలు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. సరిహద్దుల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల వల్ల మా పౌరుల తరలింపు కార్యక్రమంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రజల కదలికలపై సరైన అంచనాలతో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అత్యవసర మానవతా సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాల్సి ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉండాలనుకుంటున్నాం’’ అని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి అన్నారు.
రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్కు క్రమంగా ఒక్కో దేశం ముందుకు వచ్చి మిలటరీ సాయంతో అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ఆయుధాలు అందజేస్తున్న యూరోపిన్ యూనియన్ సభ్యదేశాలు తాజాగా యుద్ధ విమానాలను సైతం పంపడానికి సిద్ధమయ్యాయి. ‘‘మేం యుద్ధ విమానాలను కూడా పంపుతాం. కేవలం ఆయుధాలు పంపడం గురించే మాట్లాడడం లేదు. యుద్ధానికి కావాల్సిన కీలక ఆయుధాలను సైతం అందజేస్తున్నాం’’ అని ఐరోపా సమాఖ్య విదేశీ విధానం విభాగపు అధిపతి జోసెఫ్ బోరెల్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఉక్రెయిన్ సైన్యం నిర్వహించగల కొన్ని అత్యాధునిక యుద్ధ విమానాలు ఈయూ వద్ద ఉన్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి తెలిపారు. వాటిని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందనగానే ఐరోపా సమాఖ్య తాజా నిర్ణయం తీసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more