ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంధన ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లోని గురుదాస్పూర్లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని అయినా ఇంధన ధరలను మోదీ సర్కార్ తగ్గించడం లేదని దుయ్యబట్టారు. తమ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకగా ఇప్పుడవి బ్యారెల్కు 90 డాలర్లకు దిగివచ్చాయని అన్నారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో మత్రం ఇవి తగ్గకపోగా మరింత భారమవుతున్నాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. చమరు ధరల నుంచి తన ఇద్దరు పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు దోచిపెట్టేందుకే మోదీ ఇంధన ధరలను తగ్గించడం లేదని దుయ్యబట్టారు. నోట్ల రద్దు, నిరుద్యోగం వంటి అంశాలపైనా మోదీ సర్కార్ తీరును రాహుల్ తప్పుపట్టారు. 2016లో నోట్ల రద్దు సమయంలో నల్ల ధనంపై పోరాటం చేస్తున్నామని మోదీ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారని అన్నారు.
రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇప్పుడు బ్లాక్ మనీ గురించి, నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతన్నలను రాహుల్ అభినందించారు. అన్నదాతల ఆందోళనలకు తమ పార్టీ అండగా నిలిచిందని గుర్తుచేశారు. రైతులు గట్టిగా నిలబడి పోరాడని పక్షంలో సాగు చట్టాలు రద్దయ్యేవి కాదని అన్నారు. తమ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని, అందుకే పార్లమెంట్ వేదికగా నల్లచట్టాలపై పోరాడామని గుర్తుచేశారు.
ఇక పంజాబ్లో ఒకే దశలో ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతతో అందలం ఎక్కాలని ఆప్ పావులు కదుపుతోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు అకాలీదళ్ సన్నద్ధమవుతుండగా, కెప్టెన్ సింగ్ సారధ్యంలోని పీఎల్సీతో జట్టుకట్టిన కాషాయ పార్టీ పంజాబ్ పోరులో సత్తా చాటాలని యోచిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more