పంజాబ్ లో ఈ నెల 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరన్ జీత్ సింగ్ చన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపి, అప్ సహా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. వాస్తవానికి ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా రాజకీయ పార్టీల నుండి అనేక అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
అయితే, ఫిబ్రవరి 16న వారణాసిలో గురు రవిదాస్ జీ జయంతి వేడుక కోసం పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో (దాదాపు 20 లక్షల మంది) భక్తులు తరలి వెళ్లనున్నారు. వారంతా వారం ముందే వారణాసి బయల్దేరతారని.. ఈ క్రమంలో ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల తేదీని వాయిదా వేయని పక్షంలో వీరంతా ఎన్నికలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. చన్ని తరువాత కాంగ్రెస్ పార్టీ సహా బీజేపి, అప్ పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని ఈ విషయమై ఎన్నికల తేదీని మార్చాలని విన్నవించాయి. దీంతో పలు రాజకీయ పార్టీల నుంచి వినతువు వెలువడంతో ఎన్నికల తేదీని మార్చింది ఎన్నికల సంఘం.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో సమీక్షించిన తరువాత.. ఓ ప్రకటన విడుదల చేస్తూ, గత కొన్ని రోజులుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇతర సంస్థల నుండి అనేక ప్రాతినిధ్యాలను స్వీకరించిందని, అదే సమయంలో జరుపుకునే మతపరమైన పండుగపై దృష్టి సారించింది. గురు రవిదాస్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 16కు ఒక వారం ముందు నుండి పంజాబ్ నుండి వారణాసికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని.. అందువల్ల పంజాబ్ పొలింగ్ తేదీని 14 నుంచి 20కి మార్చుతున్నామని ఎన్నికల సంఘం పేర్కోనింది.
పంజాబ్ కోసం కొత్త సంబంధిత తేదీలు:
1. నోటిఫికేషన్ తేదీ: జనవరి 25, 2022 (మంగళవారం)
2. నామినేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2022 (మంగళవారం)
3. పరిశీలన తేదీ: ఫిబ్రవరి 2, 2022 (బుధవారం)
4. ఉపసంహరణ తేదీ: ఫిబ్రవరి 4, 2022 (శుక్రవారం)
5. పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20, 2022 (ఆదివారం).
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10 న జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more