పంజాబ్ లో ఈ నెల 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరన్ జీత్ సింగ్ చన్నీతో పాటు కాంగ్రెస్, బీజేపి, అప్ సహా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. వాస్తవానికి ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా రాజకీయ పార్టీల నుండి అనేక అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
అయితే, ఫిబ్రవరి 16న వారణాసిలో గురు రవిదాస్ జీ జయంతి వేడుక కోసం పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో (దాదాపు 20 లక్షల మంది) భక్తులు తరలి వెళ్లనున్నారు. వారంతా వారం ముందే వారణాసి బయల్దేరతారని.. ఈ క్రమంలో ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల తేదీని వాయిదా వేయని పక్షంలో వీరంతా ఎన్నికలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. చన్ని తరువాత కాంగ్రెస్ పార్టీ సహా బీజేపి, అప్ పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని ఈ విషయమై ఎన్నికల తేదీని మార్చాలని విన్నవించాయి. దీంతో పలు రాజకీయ పార్టీల నుంచి వినతువు వెలువడంతో ఎన్నికల తేదీని మార్చింది ఎన్నికల సంఘం.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో సమీక్షించిన తరువాత.. ఓ ప్రకటన విడుదల చేస్తూ, గత కొన్ని రోజులుగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు ఇతర సంస్థల నుండి అనేక ప్రాతినిధ్యాలను స్వీకరించిందని, అదే సమయంలో జరుపుకునే మతపరమైన పండుగపై దృష్టి సారించింది. గురు రవిదాస్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో వచ్చే నెల 16కు ఒక వారం ముందు నుండి పంజాబ్ నుండి వారణాసికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉందని.. అందువల్ల పంజాబ్ పొలింగ్ తేదీని 14 నుంచి 20కి మార్చుతున్నామని ఎన్నికల సంఘం పేర్కోనింది.
పంజాబ్ కోసం కొత్త సంబంధిత తేదీలు:
1. నోటిఫికేషన్ తేదీ: జనవరి 25, 2022 (మంగళవారం)
2. నామినేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2022 (మంగళవారం)
3. పరిశీలన తేదీ: ఫిబ్రవరి 2, 2022 (బుధవారం)
4. ఉపసంహరణ తేదీ: ఫిబ్రవరి 4, 2022 (శుక్రవారం)
5. పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20, 2022 (ఆదివారం).
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10 న జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more