పంజాబ్ లోని హేుస్సేనివాలంలో గల అమరవీరుల స్థూపం వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తున్న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్ ని దారిమధ్యలో రైతులు అడ్డగించడంపై నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. దేశ ప్రజలందరికీ ప్రతినిధి అయిన అత్యంత ముఖ్యమైన వ్యక్తికి పటిష్ఠ భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఫిరోజ్ పూర్ లోని ప్రధాని ర్యాలి నిర్వహించే సభాస్థలికి లక్ష మంది జనం వస్తారని ఏర్పాట్లు చేసినా కనీసం వందల సంఖ్యలోనూ ప్రజలు రాకపోవడంతో.. కావాలనే రైతులు నిరసన దీక్ష చేస్తున్న మార్గాన్ని చివరి నిమిషంలో ఎంచుకున్నారని వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ఈక్రమంలో అటు ఢిల్లీ శివార్లలో ఏడాది పాటు శాంతియుత దీక్షలు చేసిన రైతులతో పాటు ఇటు తమ ప్రత్యర్థైన కాంగ్రెస్ పార్టీని.. ఆపార్టీ పాలిత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కారణంగానే తమ క్యాబినెట్ మంత్రిని కూడా రక్షించే చర్యలకు ప్రధాని పూనుకున్నారని కూడా అరోపణలు ఊపందుకున్నాయి. కేంద్రమంత్రి తనయుడిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని ఇలా రైతుల నిరసన దీక్షలు జరుగుతున్న రోడ్డు మార్గాన్ని చివరి నిమిషంలో ఎంచుకుని తన సభ ప్లాప్ అయ్యిందన్న వార్త తెలియకుండా.. మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకోచ్చి ప్రజల దృష్టి మరల్చారన్న అరోపణలు లేకపోలేదు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. దీన్ని సిగ్గుచేటుగా ఆమె అభివర్ణించారు. ‘‘పంజాబ్ లో జరిగినది నిజంగా అవమానకరం. గౌరవనీయ ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేత, ప్రతినిధి. 140 కోట్ల ప్రజల గొంతుక. ఆయనపై దాడి అంటే ప్రతీ భారతీయుడిపై దాడి అవుతుంది. ఇది మన ప్రజాస్వామ్యంపైనే దాడి. పంజాబ్ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. వారిని ఇప్పుడు కనుక నిలువరించకపోతే.. తర్వాత దేశం మొత్తం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మోదీకి అండగా భారత్ నిలుస్తుంది’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more