ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేళ్లూనుకుంటోంది. ఇప్పటికే దాదాపుగా ఎనభై దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ ముప్పు.. మరణాలను కూడా అంతకంతకూ నమోదు చేసుకుంటూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప.. డెల్టా వేరియంట్ తో పోల్చితే దీని ప్రభావంత తక్కువని వైద్య నిఫుణులు చెప్పినా.. మరణాలు మాత్రం అంతకంతకూ.. నమోదు చేసుకుంటూనే వుంది. దీంతో ఇది కూడా ప్రమాదకారి అన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. తాజాగా ఈ కరోనా వేరియంట్ హైదారాబాద్ లో తీవ్ర కలకలం సృష్టించింది.
హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు అసుపత్రిలోని వైద్యుడుికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఇవాళ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన తాజా గణంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 24 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, అందులో ఒకటి ఈ వైద్యుడిదే. క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పేరోందిన ఈ వైద్యుడి వద్దకు వచ్చిన ఓ విదేశీ క్యాన్సర్ రోగి.. చికిత్స కోసం వచ్చాడు. ఆ తరువాత ఈ వైద్యుడికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని తేలింది. దీంతో వీదేశీ రోగి నుంచి ఒమిక్రాన్ సోకడంతో ప్రైవరీ కాంటాక్టుగా గుర్తించిన అసుపత్రి వర్గాలు కరోనా అని తేలిన వారినందరినీ హోమ్ ఐసోలేషన్ కు పంపించింది.
కరోనా అని తేలిన అసుపత్రిలోని రోగులతో పాటు స్టాప్ నుంచి కూడా నమూనాలను సేకరించిన అసుపత్రి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వాటిని పంపించింది. ఇక ఆ రోజున నుంచి సదరు క్యాన్సర్ నిపుణుడి వద్ద చికిత్స చేయించుకున్న రోగుల వివరాలతో పాటు సెకండరీ కాంటాక్టు జాబితాను గుర్తించే పనిలో పడ్డారు ప్రభుత్వం అరోగ్యశాఖ సిబ్బంది. సెకండరీ కాంటాక్టులను కూడా క్వారంటైన్ లో భాగంగా హోం ఐసోలేషన్ లో పెట్టనున్నారు. ఆసుపత్రి ఆవరణలోనూ కరోనా నియంత్రణ చర్యలకు పూనుకున్నారు. అయితే డాక్టర్ కరోనా వాక్సీన్ వేసుకున్నాడా.? లేదా.? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more