యాడ్ డిజైనర్లు మరీ బరి తెగిస్తున్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై వారికి ఎలాంటి అవగాహన లేకుండా పోతోంది. ఎలాంటి వాటికి ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వాలో కూడా తెలియకుండా పోతోంది. పాశ్చాత మోజులో పడి.. అసభ్య దృశాలకు పవిత్రమైన వస్తువులకు ముడిపెట్టి ప్రకటనలు తీసున్నారు. దీంతో ఎవరికి వారు తమ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో వ్యతిరేకత మాత్రమే వ్యక్తం చేస్తే.. సరిపోదని.. వారికి ఉనికికే ప్రమాదం వస్తుందన్న హెచ్చరికలే పనిచేస్తామని నిరూపించారు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.
హోం మంత్రి నుంచి హెచ్చరికలు రావడం.. పోలీసులు కూడా ఆయన గురించి తిరగడంతో.. వెంటనే దిగివచ్చిన యాడ్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ తన ప్రకటనను తక్షణం ఉపసంహరించుకున్నారు. హిందూ మహిళల తాము ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్ర ప్రకటనను అసభ్యంగా చిత్రీకరించి విమర్శలపాలయ్యాడు. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు మంగళసూత్రం పవిత్రతను దెబ్బతీశారంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విషయం హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి విషయం రాగానే ఆయనదీనిపై తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లోగా ఈ ప్రకటనను ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళ్తానని హెచ్చరికలు జారీ చేశారు.
ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు అమాత్యుని అల్టిమేటంతో దిగొచ్చిన సవ్యసాచి ముఖర్జీ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. వారసత్వం, సంస్కృతిని కలగలిపి యాడ్ ను చిత్రీకరించామని, కానీ ఈ ప్రకటన సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందన్న ఆరోపణలతో.. యాడ్ను ఉపసంహరించుకున్నామని ఇన్స్టాగ్రామ్ ద్వారా సవ్యసాచి కంపెనీ వెల్లడించింది. ఈ ప్రకటనపై మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ తరహా యాడ్ లపై గతంలోనూ హెచ్చరించామన్నారు. అయినా.. మంగళసూత్ర యాడ్ ను అసభ్యంగా చేయడంపై వ్యక్తిగతంగా హెచ్చరించినట్టు చెప్పారు. 24 గంటల్లోగా ఈ యాడ్ ను ఉపసంహరించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పానన్నారు.
సవ్యసాచి రూపొందించిన ఆ ప్రకటనలో కొంతమంది ఒంటరిగా ఉన్న మహిళలు మంగళసూత్రం ధరించారు. మరో దాంట్లో ఓ వ్యక్తితో శృంగార భంగిమల్లో అర్ధనగ్నంగా ఉన్న మహిళ మంగళసూత్రం ధరించింది. దీంతో మంగళసూత్రం పవిత్రను కించపర్చేలా ఉండడంతో వాటిపై నెట్ జనులు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. ఈ ప్రకటన హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని దుమ్మెత్తి పోశారు.విషయం అమాత్యుడి దృష్టికి వెళ్లడంతో ఆయన హెచ్చరికలతో డిజైనర్ దిగివచ్చి తన యాడ్ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more