ఇంధన ధరల పెంపుతో దేశంలోని వాహనదారుల జేబుల్లోని డబ్బులను దోపిడి చేస్తున్న కేంద్రం.. కేవలం నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలకు మాత్రమే లాభాలను సమకూర్చేలా చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ సన్నిహిత వ్యాపార వేత్తలను ఉద్దేశించి రాహుల్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హయాంలో ఇంధన ధరలు చుక్కలు తాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముడి చమురు ధరలు అధికంగా ఉన్నాయని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నా ప్రజలపై పెట్రో భారాలు మోపుతున్నారని మోదీ సర్కార్పై మండిపడ్డారు.
యూపీఏ హయాంలో ముడి చమరు ధరలు బ్యారెల్కు 140 డాలర్లకు చేరగా, ఇప్పుడవి చాలా తక్కువగా ఉన్నా మనం పెట్రోల్, డీజిల్ ధరలపై అధిక మొత్తం చెల్లించాల్సిన దుస్ధితి నెలకొందని రాహుల్ అన్నారు. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో రాహుల్ శనివారం పర్యటించారు. గోవాలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఒక్కరోజు పర్యటన కొనసాగుతున్నది. ఒక్కరోజు పర్యటన కోసం ఇవాళ గోవాకు వెళ్లిన రాహుల్గాంధీ ముందుగా.. దక్షిణ గోవాలోని వల్సావో గ్రామంలో మత్స్యకారులతో సమావేశమయ్యారు.
ఈ సంర్దభంగా ఆయన మాట్లాడుతూ తాము ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలు కేవలం హామీలు మాత్రమే కాదని, గ్యారంటీలని చెప్పారు. ఈ విషయాలను చత్తీస్ గడ్ సహా అంతకుముందు గెలిచిన కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలలోనూ తెలుసుకోవాలని సూచించారు. అక్కడ ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలను ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలుపర్చి రైతులు కష్టాలను దూరం చేశామని ఆయన తెలిపారు. ఆ తర్వాత పనాజీలోని అజాద్ మైదాన్ ఏరియాలోగల అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరారు.
ఈ సందర్భంగా రాహుల్గాంధీ ట్యాక్సీ బైక్పై ప్రయాణం చేశారు. గోవాలో మోటార్ సైకిళ్లను అద్దెకిస్తుంటారు. పైలట్గా సుపరిచితమైన ఈ మోటార్ సైకిల్ ట్యాక్సీ సర్వీస్ నుంచి ఒక బైకును అద్దెకు తీసుకుని రాహుల్గాంధీ దానిపై ప్రయాణం చేశారు. ముందు ఒక వ్యక్తి బైకును నడుపుతుంటే రాహుల్గాంధీ అతని వెనుక కూర్చుని ప్రయాణించారు. ఇంతకూ ఆ ట్యాక్సీ బైకుపై ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారంటే గోవా రాజధాని పనాజీలోని బాంబోలిమ్ నుంచి అజాద్ మైదాన్ వరకు. ఆ తర్వాత అజాద్ మైదాన్లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు.
#WATCH | Congress leader Rahul Gandhi takes a ride on Goa's motorcycle taxi known as 'Pilot', from Bambolim to Azad Maidan in Panaji
— ANI (@ANI) October 30, 2021
(Source: Congress party) pic.twitter.com/kCc0KVQsoY
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more