ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కొందరు దాడి చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. విజయవాడలో పట్టాభి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టాభి.. ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసులునోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు, రాష్ట్రప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాటలను తప్పుపడుతూ టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై కూడా కొందరు దుండగులు దాడి చేశారు. కార్యాలయం ఎదుట ఉన్న ప్రముఖుల కార్లను ధ్వంసం చేశారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. పట్టాభిరామ్ నివాసంపై దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సాయంత్రం 4.30 గంటల సమయంలో దాడి జరిగిందని తెలిపారు.
Attack on #TeluguDesam @JaiTDP central party office in #Mangalagiri, allegedly by party workers of ruling @YSRCParty, after provocative & 'unparliamentary' remarks were reportedly made repeatedly by party spokesperson #PattabhiRam at a televised press conference @ndtv @ndtvindia pic.twitter.com/QwUmLEtiZr
— Uma Sudhir (@umasudhir) October 19, 2021
సుమారు 200 మంది వరకు తమ ఇంటిపైన దాడి చేశారని వివరించారు. గట్టిగా కేకలు వేస్తూ సామగ్రి ధ్వంసం చేశారని, పట్టాభి దొరికితే చంపేస్తామని హెచ్చరించారని కుటుంబ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. కాగా, పెద్ద పెద్ద రాళ్లు తీసుకువచ్చిన దుండగులు పట్టాభి నివాసంలోని కారును, బైకును, అక్కడున్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో పట్టాభి నివాసంపై దాడి, మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసంతో పాటు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడి ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు.
గవర్నర్ కు ఫోన్ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని వివరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నేటి దాడిలో దెబ్బతిన్న వైనాన్ని చంద్రరబాబు స్వయంగా పరిశీలించారు. అనంతరం కేంద్ర హోంశాఖ వర్గాలతోనూ చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయంటూ, ఇవాళ్టి ఘటనలను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయం కోరారు. కాగా, దీనిపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ బలగాలను పంపించేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించిందని వెల్లడించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more