తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న వి.సి సజ్జనార్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్ ఆర్టీసీ కార్మికులకు నెలసరి వేతనాలు ఎప్పుడు లభిస్తాయా.? అంటూ వేచి చూడాల్సి వస్తొంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించడం కూడా ఆర్టీసీ యాజమాన్యానికి గగనంగా మారుతోంది. ప్రస్తుతం ప్రతినెల 7వ తేదీ నుంచి 14వ తేదీలోపు విడతల వారీగా, జోన్ల వారీగా చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలో ఉద్యోగుల వేతనాల విషయమై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన.. ఉద్యోగులందరీకీ శుభవార్తను అందించారు. ఇకపై తెలంగాణా ఆర్టీసీ కార్మికులందరికీ ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వానున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల నుంచే ఇది అమలులోకి రానుందని చెప్పారు. దసరా నేపథ్యంలో ఇవాళ వేతనాలు అందనుండడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ కార్మకులకు దసరా, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపే నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే కార్మికులు మరింత బాధ్యతగా, క్రమశిక్షణతో తమ విధులన్ని నిర్వహించి.. ప్రయాణికులను సురక్షితంగా, నిర్ధేశిత సమయంలోగా తమ గమ్యస్థానాలకుచేర్చాలని కోరారు. కాగా, ఇటీవల ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి కూడా ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలోని దాదాపు 48 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లు నేడు వేతనాలు అందుకోనున్నారు. కాగా, ఆర్టీసీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీర్ఘకాలిక సెలవులపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లకు ఏడాదిపాటు దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేస్తామని, అవసరమైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more