రెండు మూడేళ్ల కిత్రం నుంచి దేశంలో అటోమెబైల్ అమ్మాకాలు మరీ ముఖ్యంగా కార్ల అమ్మాకాలు సన్నగిల్లాయి. ఇక గత ఏడాది కాలంగా ఇంధన ధరలు కూడా పెరగడంతో దేశ ప్రజలు అపసోపాలు పడుతూనే పెట్రోల్, డీజిల్ వాహనాలను నడుపుతున్నారు, ఇంధన ధరలు అకాశాన్ని అంటుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నులను సడలిస్తాయని అశించిన వాహనదారులకు నిరాశే ఎదురైంది. కాగా, తాజాగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలు కూడా ఫేమ్-2 కింద ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సీడీలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఏడాది, రెండేళ్లు ఇంధనానికి పెట్టే చార్జీలను వెనకేస్తే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తాయన్న భావన వాహనదారుల్లో నెలకోంది.
ఇక ప్రభుత్వాలు ప్రకటించిన సబ్సీడిలు ఉన్నప్పుడే ఈ వాహనాలను కొనుగోలు చేస్తే.. తమకు కాసింత కలసి వస్తుందన్న ధోరణి కూడా వాహనదారుల్లో నెలకోంది. ఈ క్రమంలో ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ అనేక కంపెనీలు నిమగ్నమయ్యాయి. ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఓలా, బజాబ్, హీరో, ఏథర్, ప్లూటో సహా పలు కంపెనీల వాహనాలు ఇప్పటికే మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఓ ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వాహనాన్ని దాని యజమాని నడుపుతూ వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో వెనకాల వస్తున్న వాహనదారులు చెప్పడంతో వాహనాన్ని నిలిపివేసిన వాహన యజమాని. ఏం జరిగిందా.? అంటూ సీటు తెరచి చూస్తే పోగలు మరింత ఉదృత్తంగా రాసాగాయి. జరిగిన విషయాన్ని తన స్నేహితులతో చెప్పిన ఆయన సదరు విషయాన్ని షోరూం యాజమాన్యానికి చేరవేయాలని సూచించాడు. అసలేం జరిగిందని స్నేహితులు అడగ్గా.. తనకే తెలియదని, తన వాహనంలోని బ్యాటరీలోంచి పోగలు చిమ్ముతున్నాయని చెప్పాడు. ఈలోగా ఈ విచిత్ర ఘటనను చూసిన స్థానికులు తమ సెల్ ఫోన్లలో దానిని బంధించి నెట్టింట్లో పెట్టగా అది కాస్తా వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more