ఒడిశాలో అధికార బీజేడీ పార్లమెంట్ సభ్యుడు సహా అతిని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన విషయాన్ని పోలిస్ స్టేషన్ హౌజ్ ఆపీసర్ ధృవీకరించారు. కటక్ నుంచి బీజేడీ అభ్యర్థిగా పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రాతృహరి మహతాబ్ పై రాజధాని నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ లలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కేసులో ఆయన భార్య మహాశ్వేత, కుమారుడు లోకరంజన్ పై కూడా కేసు దాఖలైంది.
ఎంపీపై వరకట్న వేధింపులతోపాటు రాజద్రోహం, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును భోపాల్ నివాసి, 34 ఏండ్ల బ్రాతృహరి మహతాబ్ కోడలు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. భోపాల్ మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి అజిత నాయర్ ప్రకారం, భోపాల్ లోని ఎంపీ నగర్ లోని మహాదేవ్ కాంప్లెక్స్లో నివసిస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేసింది. వ్యాపారవేత్త, బీజేడీ ఎంపీ బ్రాతృహరి మహతాబ్ కుమారుడు లోకరంజన్ మహతాబ్ తో తన వివాహం 2016 డిసెంబర్ నెలలో జరిగింది.
పెండ్లి సమయంలో తన తండ్రి కట్నకానుకలు చాలా ఇచ్చారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. వివాహం అనంతరం భర్తతో పాటు అత్తమామలు మరింత కట్నం కావాలంటూ డిమాండ్ చేస్తూ వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులతో విసిగిపోయిన ఆమె చాలాసార్లు పుట్టింటికి వెళ్లింది. 2018 లో ఆమె న్యూఢిల్లీలోని ఏబీ-94 షాజహాన్ రోడ్ లోని తన అత్తమామల ఇంటికి చాలాసార్లు వెళ్లింది. కానీ ఆమెను వారు ఇంట్లోకి రానీయలేదు. ఇంటి తలుపులు కూడా తెరవలేదు. దాంతో ఆమె భోపాల్ చేరుకుని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more