తిరుమల శ్రీవారి ఏడుకొండలు ఎక్కినా.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం కలగడం లేదు. ఎన్నోన్నో అంచానాలు.. ఎవరెవరో సిఫార్సు లేఖలు పట్టుకెళ్లినా.. ఆన్ లైన్ లో టిక్కెట్టు పోందిన భక్తులకు మాత్రమే దర్శనభాగ్యం కలుగుతుంది తప్ప.. మిగతాభక్తులను తిరుమల శ్రీవారు కరికరించడం లేదు. గోవిందా.. గోవిందా అంటూ ఎన్ని మెట్టు ఎక్కినా.. లేక ఏడు కొండలను కారులో, బస్సులో లేదా ఇతరాత్ర రవాణా సౌకర్యాలతో దాటి చేరినా.. తిరుమలేశుడు మాత్రం కానరావడం లేదు. దీంతో భక్తులు ఏ చోట చూసినా నీవుందువందురే.. ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా అంటూ తిరుగు పయనం అవుతున్నారు.
అయితే కొందరు భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల కోండకు చేరామని.. తమకు ఎలాగైనా దర్శనభాగ్యం కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని గుర్తుపట్టిన కొందరు కేటుగాళ్లు విసిరే మాయమాటలకు.. లొంగిపోయి మోసపోతున్నారు. తాజాగా అలాంటి వారి జాబితా చెంతాడంత పెరుగుతూపోతోందని సమాచారం. అదెలా అంటే కొందరు కేటుగాళ్లు భక్తులకు నకిలీ దర్శన టికెట్లను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఇంటి దొంగల హస్తమున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరెవరిపై అయితే అనుమానాలున్నాయో వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. కొన్ని టికెట్లనే ఆన్ లైన్ లో పెడుతున్నారు. స్లాట్ ఇలా ఓపెన్ అయిపోతే చాలు.. టికెట్లు అలా అయిపోతున్నాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పట్లేదు. ఈ క్రమంలోనే కొందరు దళారులు ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పాత కల్యాణోత్సవ టికెట్లను డౌన్ లోడ్ చేసి వాటిని మార్చి, భక్తుల పేర్లను చేర్చి నకిలీలుగా మారుస్తున్నారు. వాటినే భక్తులకు అంటగడుతున్నారు. అందులో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అయితే, వారికి తిరుమల తిరుపతి దేవస్థానంలోని కొందరు ఉద్యోగులే సహకరిస్తున్నారని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ తంతు నడుస్తున్నా.. బార్ కోడింగ్ స్కాన్ చేసినప్పుడు అవి నకిలీవన్న సంగతిని సిబ్బంది ఎందుకు గుర్తించట్లేదన్న అనుమానాలను వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులకు తిరుమల, తిరుపతిలోని జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో సంబంధాలు ఉండి ఉంటాయని అంటున్నారు. దానిపైనే ఇప్పుడు అధికారులు ఫోకస్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more