పబ్జీ గేమ్ అంటేనే యువతలో ఓ క్రేజ్. ఈ గేమ్ అడేందుకు వారు అదునాతన ఫీచర్లు వున్న మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి మరీ గేమ్ అడతారు. అయితే కొన్నాళ్ల క్రితం ఈ గేమ్ ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. కాగా, తాజాగా ఈ గేమ్ ఇండియన్ అవతార్ మళ్లీ యువత దరి చేరింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ గా రావడంతోనే ఇది సంచలనాలు సృష్టించింది. ప్లే స్టోర్ లో కేవలం వారం రోజుల్లోనే 3 కోట్లకు పైగా గేమింగ్ ప్రియులు ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గేమ్ పై మరింత ఆదరణ పెంచేందుకు క్రాప్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్స్ సీజన్ 21 పేరిట ఓ టోర్నమెంట్ ను ప్రకటించింది.
ఇన్నాళ్లు ఆడి చికెన్ బకెట్ అందుకున్న యువత.. ఇకపై ఈ గేమ్ టోర్నీలో అడితే కోటి రూపాయలను మీ సోంతం చేసుకోవచ్చు. అదేంటి ఇది కూడా ఉత్తుత్త చికెన్ బక్కెట్ మాదిరే అనుకుంటున్నారా..? ఎంతమాత్రం కాదు. నిజమైన కోటి రూపాయల ప్రైజ్ మనీ మీ సోంతం అవుతోంది, ఈ మేరకు కాన్సెప్ట్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ప్రైజ్ అందరికీ కాదు.. ఈ టోర్నమెంట్లో మొదటి 16 స్థానాల్లో నిలిచిన వారికి పంచనున్నారు. గేమ్ లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.50 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్నవారికి రూ.25 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.10 లక్షలు రూపాయలను బహుమతిగా అందించనున్నారు.
అయితే నాల్గో స్థానంలో నిలిచిన వారికి రూ.3 లక్షలు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ.2లక్షలు, ఆరో స్థానంలో నిలిచిన వారికి రూ.1.5 లక్షలు, ఏడో స్థానంలో నిలిచిన వారికి లక్ష రూపాయలు ప్రైజ్గా ఇవ్వనున్నట్లు క్రాప్టన్ సంస్థ ప్రకటించింది. ఇక ఎనిమిదో స్థానం నుంచి 16వ స్థానం వరకు ఒక్కో ర్యాంకు తగ్గిన కొద్ది రూ.10వేలు తగ్గించి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఎనిమిదో స్థానంలో నిలిచిన వారికి రూ.90 వేలు ఇస్తే.. తొమ్మిదో స్థానంలో నిలిచిన వారికి రూ.80వేలు.. ఇలా చివరగా 16వ స్థానంలో నిలిచిన వారికి 10వేల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు.
టోర్నీలో పాల్గొనాలంటే..
ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు జూలై 19 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలు కానున్నాయి. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 మధ్యలో క్వాలిఫయర్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఈ గేమ్ ఆడాలంటే కచ్చితంగా భారతీయులై ఉండాలి. ప్లేయిర్ అకౌంట్ ప్లాటినమ్ లేదా అంతకంటే ఎక్కువ ర్యాంకింగ్ది అయి ఉండాలి. బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సీజన్ 2021కి రిజస్టర్ చేసుకున్న ప్లేయర్లు మొత్తం 15 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ 15 మ్యాచ్ల్లోని టాప్ 10 మ్యాచ్ల ఆధారంగా స్కోరింగ్ ఇస్తారు. టాప్లో నిలిచిన 1024 టీమ్లను తర్వాత రౌండ్కు క్వాలిఫై చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more