Diesel drops for the first time in 3 months మూడు నెలల్లో తొలిసారిగా డీజిల్ ధరలో కొత.. పెట్రోల్ పై వాత

Petrol touches record high on july 12 breaches rs 107 litre in mumbai diesel slips

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

After remaining unchanged for a day, petrol prices were hiked on Monday, July 12, 2021, touching a record high across the country, while diesel rates dipped marginally. In the national capital, the petrol price rose 28 paise while that of diesel slipped 16 paise.

మూడు నెలల్లో తొలిసారిగా డీజిల్ ధరలో కొత.. పెట్రోల్ పై వాత

Posted: 07/12/2021 02:59 PM IST
Petrol touches record high on july 12 breaches rs 107 litre in mumbai diesel slips

ఇంధన ధరలను ఇకపై పెంచేది లేదని, ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీరాలు పోయిన కేంద్ర ప్రభుతం.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో వంద రూపాయలు దాటిన ఇంధన ధర.. చారిత్రక ధరలకు చేరుకుంది. గత డెభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ ధర పరుగులు పెడుతోంది. ఇంధన ధరలను చమురు కెంపెనీలు ఏకంగా మే నెలలో 16వ సారి ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జూలైలో అప్పుడే ఎనమిది పర్యాయాలు పెంచింది కేంద్రం.

గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరుకుంది. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధరల 101 రూపాయలకు చేరువలో వుంది. దీంతో పాటు దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100ను మించి పరుగులు పెడుతొంది. దేశంలో ఈ ధరల్లో ఇంధన కోనసాగడం చారిత్రక గరిష్టంగానే చెప్పుకోవచ్చు. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది.  

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76.09 డాలర్లు దాటింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 28 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధరను మాత్రం యధాతధంగా కోనసాగిస్తున్నాయి. మే 4 నుంచి నెలలో ఇప్పటివరకు చమురు ధరను 36 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.8.95, డీజిల్‌పై 7.87 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.106 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.19గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.89.72కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.20గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.29కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.92గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.24కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.101.35గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.92.81కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ..107.88 కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.28కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.105.15గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.78కు చేరింది.
భోపాల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.53 గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.98.40కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.104.58గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.98.50కు చేరింది.
పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.103.92గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ. 95.94కు చేరింది.
చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.97.31గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.89.35కు చేరింది.
లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ. 98.29గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.90.11కు చేరింది.
తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.103.17గా నమోదు కాగా, లీటరు డీజిల్‌ రూ.96.30కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles