ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. రెండ్రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకు తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా?లేదా స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో 11వ తరగతి పరీక్షలను కరోనా ప్రభావం తగ్గిన తరువాత సెప్టెంబరులో నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో మూల్యాంకణ విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం అఫిడెవిట్ దాఖలు చేయని రాష్ట్రాల విషయాన్ని చర్చించింది. 28 రాష్ట్రాలకుగానూ 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన ఆరు.. కరోనా రెండో ఉద్ధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనరు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయలేదని పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం ఆయా రాష్ట్రాలకు నోటీసులు జారీచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more