సైబర్ మోసగాళ్లల్లో ఎదుటివారిని బురడీ కోట్టించే తెలివితేటలు అమోఘం. అయితే అవే తెలివిని సక్రమంగా వినియోగిస్తే.. వారు దేశానికి ఒక ఆస్తిగా మారుతారనడంలో. దేశాభివృద్దిలోనూ కీలక పాత్రపోషిస్తారనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ తెలివి తేటలను కేవలం ఎదురువారి వ్యక్తిగత సమాచారంతో పాటు వారి సెల్ ఫోన్ లో దాచుకున్న సమాచారం మొత్తాన్ని చౌర్యం చేసి.. ఈజీగా మనీ సంపాదించడానికే వినియోగిస్తున్నారు. దీంతో తమకేదో ఆఫర్ వచ్చిందనుకునే సామాన్యులు ఆశగా సైబర్ నేరగాళ్ల తెలివితేటలకు బోల్తా పడతుంటారు.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను తొక్కుతున్నారు. పేదలు, మధ్యతరగతివారిని ఉచ్చులోకి లాగి తమ పబ్బం గడుపుకుంటారు. అందుకోసం... ఆఫర్లు, బంపర్ ప్రైజులు పేరిట ఎర వేస్తారు. ఎవరైనా తమ గాలానికి చిక్కుకుంటే వారిని నిలువుదోపిడీ చేస్తారు. ఇటీవల కాలంలో రకరకాలుగా మోసాలకు తెరలేపిన సైబర్ నేరగాళ్లు తాజాగా టాటా సఫారీ కారు మీదేనంటూ కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. టాటా మోటార్స్ సంస్థ 30 మిలియన్ల వాహనాలు అమ్మిన సందర్భంగా ఓ సఫారీ వాహనాన్ని ఫ్రీగా అందిస్తోందని వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే టాటా మోటార్స్ వెబ్ సైట్ కి కాకుండా, మరో పేజీకి వెళుతోంది. అక్కడ 4 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలంటూ కోరడం, ఆపై వ్యక్తిగత సమాచారం రాబడుతున్న విషయం వెల్లడైంది. ఆ పేజీలో పలువురు తమకు కారు బహుమానంగా వచ్చిందంటూ ఇతరులను నమ్మించేలా కామెంట్లు పెట్టడం కూడా చూడొచ్చు. అయితే అవన్నీ ఫేక్ ఐడీలేనట. ఇలాంటి ప్రకటనల పట్ల మోసపోవద్దని, వీటికి ఆకర్షితులైతే వ్యక్తిగత సమాచారాన్ని మోసగాళ్లకు అందించినట్టేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు, టాటా మోటార్స్ ఇలాంటి ఉచిత వాహనాల ప్రకటనే చేయలేదని వివరించారు. ఇలాంటి మోసపూరితమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కాగా, ఈ టాటా సఫారీ సైబర్ నేరగాళ్ల రాకెట్ కు సంబంధించి సైబరాబాద్ సైబర్ పోలీసులు పది మందిని ఇప్పటికే అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. పలు ఈ కామర్స్ సైట్లు, లేదా ప్రముఖ టెలీ మార్కెటింగ్ పేర్లతో వీరు సామన్యులను బురడీ కొట్టిస్తున్నారని పోలీసులు తెలిపారు. తమకు అందిన పిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 1న ఐదుగురు తెలంగాణ వాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు. కాగా మరో ఐదుగురు తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. అయితే అరస్టయిన పది మంది నుంచి 42 మొబైల్ ఫోన్లు, రెండు లాప్ టాప్ లు, 18 ఎన్వలప్ కవర్ల బండిళ్లు, నాప్ టల్ కవర్లు, స్ర్కాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, రెండు రబ్బర్ స్టాంపులను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more