కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సోషల్ మీడియా పగ్గాలను తమ చెక్కుచేతల్లో పెట్టుకోవాలని చూస్తన్న ప్రక్రియను చేపట్టి నూతన మార్గదర్శకాలను కూడా తీసుకువచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజాలను తమ అదుపాజ్ఞనల మేరకు నడుచుకునేలా చర్యలను తీసుకుంది. ఎందుకింతలా పట్టుబట్టిందన్న విషయాలు ముందుగా అర్థం కాని దేశ ప్రజలకు నిదానంగా అంతా బోధపడుతున్నాయి, కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేసేలా.. అలాంటి భావన ఉత్పన్నమయ్యేలా ఏ పోస్టు వచ్చినా.. దానిని ఏమాత్రం ఉపక్షించకుండా చర్యలు తీసుకోవడం కోసమేనని తాజా చర్యలతో అర్థమవుతుంది.
మరీ ముఖ్యంగా లక్షలాది ఫాలోవర్ుల వున్న ప్రముఖులు తమకు వ్యతిరేకంగా ఎలాంటి ట్వీట్లు పెట్టినా వాటిని తక్షణం తొలగించే చర్యల్లో బాగంగానే నూతన మార్గదర్శకాలను రూపోందించి వాటిని అమలుపర్చిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లు చూసిన కేంద్రం వారి ఖాతాలపై చర్యలు తీసుకోవడంతోనే ఈ సందేహాలు ఉత్పన్నమయ్యేలా చేసింది. ట్వీట్లనే కాదు వారి ఖాతాలను కూడా ఖతం చేసింది.
గత ఆరున్నర నెలలుగా ఢిల్లీ సరిహద్దులో కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేసిన నలుగురు ప్రముఖుల ఖాతాలను ట్విట్టర్ తొలగించింది. రైతు ఉద్యమంపై ట్వీట్లు చేస్తూ అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రభుత్వ సూచనతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ నిలిపివేసిన ఖాతాల్లో పంజాబ్కు చెందిన ప్రముఖ ర్యాప్ సింగర్ జస్విందర్ సింగ్ బైన్స్ (కెనడా), హిప్ హాప్ కళాకారుడు సుఖ్దీప్ సింగ్ భోగల్ (ఆస్ట్రేలియా) సహా మరో ఇద్దరి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది.
పంజాబ్ లో పుట్టి కెనడాలో పెరిగిన జస్విందర్సింగ్ ‘క్రౌన్డ్ ప్రిన్స్ ఆఫ్ భాంగ్రా’గా పేరుకెక్కారు. ‘ఘగియన్ దా జొర్రా’, ‘హుస్నా ది సర్కార్’ వంటి పాటలు ఆయనకు విశేష ఆదరణ తెచ్చిపెట్టాయి. జస్విందర్, సుఖ్దీప్ సింగ్ ఇద్దరూ రైతు ఉద్యమానికి మద్దతుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఉద్యమం సందర్భంగా సంభవించిన మరణాలపై వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచనతో వీరి ఖాతాను ట్విట్టర్ నిలిపివేసింది. ఇక ఇదే అభియోగాలను మోపి వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించే అవకాశాలు వున్నయోమో వేచి చూడాల్సిందే మరి.!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more