ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త అందింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్) విషయంలో టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎప్పట్నించో చెబుతున్న టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇప్పటి వరకు జాడ లేకుండానే పోయాయి. అయితే త్వరలోనే జెంబో నోటిఫికేషన్ ను ఇస్తామని ప్రకటించి కూడా ఏడాది కావస్తోంది. దీంతో ఆశలు పెంచుకున్న ఎందరో ఉద్యోగార్థులు దానిని టార్టెగ్ గా చేసుకుని పరీక్షలకు సిద్దం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏడేళ్లకు ముందు టెట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు అనర్హులు.
ఎందకంటే ఇన్నాళ్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ పీరియడ్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ ను 7 ఏళ్ల మాత్రమే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని పొడగించింది. ఇకపై ఒక్కసారి టెట్ లో ఉత్తీర్ణులైనా అభ్యర్తులు జీవితకాలం వరకు డీఎస్సీలతో పాటు ఉపాధ్యాయలుగా కొనసాగేందుకు అర్హులు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్తను అందించిన్నట్టు మంత్రి రమేశ్ తెలిపారు. 2011 నుంచి టెట్ పాసైన వారికి ఏడేళ్ల కాలపరిమితి ఉన్న సర్టిఫికేట్ గడువును జీవితకాలానికి పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రమేష్ పేర్కొన్నారు.
గతంలో టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసిన వారికి కొత్తగా లైఫ్టైమ్ సర్టిఫికెట్ ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ప్రకారం.. ఫిబ్రవరి 11, 2011 నుంచి టెట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి ఏడేళ్ల నుంచి జీవితకాలనికి సర్టిఫికేట్ గడువును పొడిగిస్తున్నట్టు మంత్రి రమేశ్ వెల్లడించారు. 7 సంవత్సరాల వ్యవధి ఇప్పటికే ముగిసిన అభ్యర్థులకు కొత్త టెట్ సర్టిఫికెట్లను తిరిగి ధృవీకరించడానికి లేదా ఇవ్వడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, యుటిలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బోధనా రంగంలో వృత్తిని సాధించాలనుకునే అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రమేష్ పోఖ్రియాల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more