కరోనాకు ఆయుర్వేద మందును పంపిణీ చేసేన నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వారం రోజుల తరువాత విడుదల చేసినట్లే చేసిన పోలీసులు.. ఆయనను మరోమారు ప్రత్యేక బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను ఎక్కడికి తరలించారన్న విషయం తెలియకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే వారం రోజుల క్రితం ఆనందయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలిస్ స్టేషన్లో ఆ తరువాత మరో చోటుకు తరలించి తమ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అలా వారం రోజుల తరువాత తిరిగి ఇంటికి వచ్చిన ఆనందయ్యను చూసిన ఇరుగుపోరుగు వారు ఆనందం వ్యక్తం చేయడంతో ఆది కాస్తా కేవలం గంటల వ్యవధిలోనే అవిరైపోయింది. ఆనందయ్య కుటుంబసభ్యులు కూడా ఆయనను మరోమారు పోలీసులు రహస్య ప్రాంతానికి తరటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య కూడా పోలీసుల తీరు దారుణంగా వుందని చెప్పింది. వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిప్పిన ఆనందయ్యను ఇంటికి పంపించిన గంటల వ్యవధిలోనే మళ్లీ తీసుకెళ్లడంపై అమె పెదవి విరిచారు. ఆనందయ్యను ఇంట్లోనే ఉంచి పోలీసులు భద్రత కల్పించవచ్చు కాదా అని అన్నారు.
ఆనందయ్యకు రక్షణ పేరుతో తమకు దూరంగా వుంచుతున్నారని ఇదెక్కడి న్యాయమని అమె ప్రశ్నించారు. ప్రజలకు కరోనా మందు తయారు చేసి అందించడం కూడా నేరమేనా అని అమె నిలదీసారు. మరోవైపు, ఆనందయ్య కరోనా మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కృష్ణపట్నం వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. కాగా, ఆనందయ్య ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయనను రహస్య ప్రాంతంలోనే ఉంచుతారని సమాచారం. మరోవైపు, కృష్ణపట్నంలో విధించిన 144 సెక్షన్ కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more