దేశంలో కరోనావైరస్ రెండోదశ విలయం సృష్టిస్తూ ప్రపంచంలో ఏ దేశంలోనూ నమోదుకాని సంఖ్యలో కేసులు నమోదు చేసుకుంటూ.. అధికసంఖ్యలో మరణాలను నమోదు చేసుకుంటూ మునుపెన్నడూ లేని గణంకాలను రికార్డు చేసకుంది. ఈ క్రమంలో దేశప్రజలు వాక్సీన్ తీసుకునేందుకు ఆసక్తి చూపగా, వాక్సీన్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిసింది. దీంతో ఈ విమర్శలపై సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్, కోవిషీల్డ్ వాక్సీన్ తయారీదారుడు ఆదార్ పూనావాలా స్పందించారు.
కొవీషీల్డ్ తయారుచేస్తున్న తమ సంస్థ.. దేశంలోని ప్రజల ప్రాణాలను పన్నంగా పెట్టి ప్రపంచంలోని ఏ దేశానికి తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఎప్పుడూ ఎగుమతి చేయలేదని చెప్పింది. ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండు మూడు నెలలో పూర్తయ్యేది కాదని అన్నారు. దేశ జనాభాకు టీకాలు తయారుచేయడానికి చాలా సమయం పట్టొచ్చని అన్నారు. కోవిషీల్డ్ సహా కోవాగ్జీన్ వాక్సీన్లు ఎమర్జెన్సీ వినియోగం అనుమతులు పోంది ఉత్పత్తులు ప్రారంభమై.. టీకాలు బయటకు వచ్చిన తరుణంలో దేశంలోని ప్రజలు వాటిని తీసుకునేందుకు ఏ మాత్రం ఆసక్తిని ప్రదర్శించలేదని తెలిపారు. దీంతో వాక్సీన్లను యుద్దప్రాతిపదికన చేస్తున్న ఉత్పత్తితో తమ స్టాక్ యార్డులు నిండిపోయాయని అన్నారు.
దీంతో చేసేది లేక గత ఏడాది కరోనా తొలిదశ ఉన్నప్పుడు ప్రభుత్వానికి తాము వాక్సీన్లు అందించామని, వాటిని కేంద్రమే ఎగుమతి చేసిందని అన్నారు. అయితే వ్యాక్సిన్లను విదేశాలకు పంపేందుకు కమిట్మెంట్ తీసుకున్న ప్రకారం ఇప్పుడు పంపించాలని ఆయన తెలిపారు, జనవరిలో వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం అయినప్పటికే ఇండియాలో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయగలిగాం. అదే సమయంలో ఇతర దేశాలు సంక్షోభంలో ఇరుక్కుపోయి సాయం కోసం ఎదురుచూశాయి. అప్పుడే వీలైనంత సాయం చేశామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more