తెలంగాణలో ఆరు ప్రభుత్వ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కేవలం మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం కాకుండా ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ఆయన వీటితో పాటు ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందనిద్రాక్షాగా మారిందన్న అరోపణల నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలోని పేద, బీద ప్రజలందరికీ మెరుగైన వైద్యం. సకల సదుపాయాలతో అందేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అందుకోసం రాష్ట్రంలో ఆరు మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 12 రీజినల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ఆయన అదేశాలను జారీ చేశారు. సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్, గద్వాల కేంద్రాల్లో రీజినల్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ ప్రాంతీయ ఉపకేంద్రాల ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ అవసరమైన మందులతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలు కల్పించనున్నామని తెలిపారు. ఇక రాష్ట్రంలోనూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ప్రజలకు పట్టి పీడిస్తోందని, అయితే కోవిడ్ బారిన పడిన రోగులను సింగరేణి, ఆర్టీసీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, రైల్వే, ఆర్మీ, ఈఎస్ఐ సహా అందుబాటులో ఉన్న అన్ని ఆస్పత్రులలో సేవలు అందించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ బెడ్లు కేటాయించే విషయంతోపాటు, నిర్ణీత ధరలను నిర్ణయిస్తూ 11 నెలల క్రితమే ప్రభుత్వం 248 జీవోను విడుదల చేసిందన్నారు సీఎం కేసీఆర్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more