అరేబియా సముద్రంలో లక్షద్వీస్ వద్ద ఏర్పడిన తౌక్టే తుపాను పెను తుపానుగా రూపాంతరం చేదింది. తీవ్రరూపం దాల్చిన తుపాను కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలలో పెను బీభత్సం సృష్టించింది. అనేక ఇళ్లను నేలకూల్చడంతో వేలాంది మంది నిరాశ్రయులను చేసింది. అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా, ప్రస్తుతం పెను తుపానుగా మారింది. కేరళలో సముద్రం ముందుకు దూసుకువచ్చింది. అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కర్ణాటకలో ఏకంగా తీరప్రాంతంలోని అనేక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. కర్ణాటక, గోవాలలో తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభింవించింది. కర్ణాటకలో భారీ వర్షాల ధాటికి నలుగురు, గోవాలో ఇద్దరు మృతిచెందారు.
తుపాన్ ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్లలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తౌక్టే తుపాను 24 గంటల వ్యవధిలో మరింత బలపడుతుందని భారత వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే ముంబైపై దీని ప్రభావం అధికంగానే వుంటుందని, మరో 24 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. కాగా ఈ నెల 17న సోమవారం సాయంత్రం గుజరాత్ వద్ద తీరాన్ని తాకుతుందని, 18న పోర్ బందర్, మహువా మధ్య తీరం మధ్య తీరం దాటుంతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గుజరాత్ లో అధికారులు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.
తీరం దాటే సమయంలో గంటలకు 150 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తీరప్రాంతంతో పాటు ప్రభావిత జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో జునాగఢ్ లో మూడు మీటర్ల ఎత్తు వరకు, ఇతర తీర ప్రాంతాల్లో 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకావాలు వున్నాయని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి, వీరితో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. తీర, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను ఇప్పటికే పునరావాస శిభిరాలకు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more