ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణను కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లోనూ ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు ప్రకటన చేశారు. దీంతో ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి నూరుశాతం ఉపసంహరణలు కానున్నాయి. దీని ఆద్వర్యంలో నడిచే విశాఖ ఉక్కు కర్మాగారంలో కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలపై విశాఖలో కార్మిక సంఘాల అందోళనలను ప్రారంభమయ్యాయి,
గత మూడు రోజులుగా కార్మిక సంఘాల నేతృత్వంలో కార్మికులు అందోళనల్లో పాల్గోంటున్నారు. ఇవాళ ఉదయం ఈ అందోళనలలో భాగంగా విశాఖలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికుల నిరసన పెగ క్రమంగా రాష్ట్రంలోని వాతావరణం కూడా వేడెక్కుతోంది. యాజమాన్య హక్కులను పూర్తిగా వదులుకోవడానికి కేంద్రం సిద్ధపడడం పట్ల రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కానీ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట పరం కాకుండా చూస్తానని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు.
ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పనవ్ కల్యాణ్ స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇక్కడి ప్రజలకు ఎనలేని అనుబంధం వుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయవద్దని తాను ప్రధాని నరేంద్రమోడీని కలిసి విన్నవిస్తానని అన్నారు, విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. 22 వేల ఎకరాల్లో విస్తరించిన ఈ కర్మాగారం 17 వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు, లక్షమంది వరకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.
ఇంతటి గొప్ప ప్లాంటు ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం జనసేన అభీష్టానికి వ్యతిరేకం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కర్మాగారం విశాఖలో ఏర్పాటు చేయడానికి.. ఒక చరిత్ర వుందన్న ఆయన ఇక్కడి కర్మాగార పునాదులు.. 32 మంది అమరుల ప్రాణత్యాగాలపై నిర్మాణమయ్యాయని గుర్తచేశారు. ఈ కర్మాగారం కోసం లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని వివరించారు. ఉద్యమాల ద్వారా సాకారమైన ఉక్కు కర్మాగారం.. ఇక్కడి ప్రజల పాలిట కల్పతరువుగా మారి అనేక మందికి మూడు పూటలా బోజనం లభించేలా చేస్తోందని అన్నారు.
ఇక తాజాగా కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంతో ఈ సంస్థ చేతులు మారుతోందంటే.. ఇది తెలుగువారికి ఆమోదయోగ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసలు, పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగించింది మన్మోహన్ సింగేనని ఆరోపించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ కర్మాగారం కూడా పెట్టుబడుల ఉపసంహరణ పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని, కర్మాగారాన్ని కాపాడుకుంటామని ఉద్ఘాటించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more