కేంద్రంలోని బీజేపి అదేశాలతో రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేసేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్సు అధికారులను ఆ రాష్ట్రానికి పంపిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులను ఆ రాష్ట్రానికి పంపించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. వాటిన అంచనా వేసిన తరువాత రూపోందించే నివేదికను బట్టే బీజేపి అభ్యర్థులను బరిలోకి దింపనుందని తమకు నిర్థిష్ట సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే నేపథ్యంలోనే ఆయనకు తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ పదవిని బీజేపి కట్టబెట్టిందని, అందుకు కూడా తెరవెనుక కారణం కేసీఆర్ అని ఆయన అరోపించారు. గెలిచే అవకాశాలు వున్న చోట్ల తమ అభ్యర్థులకు బరిలో దింపేందుకు ఇంటెలిజెన్స్ నివేదిక అవసరపడుతోంది. మన రాష్ట్రానికి చెందిన అధికారులను ఇతర రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి పంపే ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ఒకే ఠాను ముఖ్కలని.. అక్కడ అన్నాడీఎంకేతో కలిసి పోటీచేస్తున్న బీజేపి ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ తో రహస్య స్నేహం పాటిస్తుందని ఆయన పేర్కోన్నారు. అవినీతి కేసులను అడ్డం పెట్టుకుని ప్రధాని మోడీ.. కేసీఆర్ ను లొంగదీసుకున్నారని అరోపించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానని ప్రధాని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు బీజేపీకి కేసీఆర్ నిధులను సమకూరుస్తున్నారని అరోపించారు. తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లు ఆటలో అరటిపండ్లవారని విమర్శించారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామన్న వారు.. ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని రేవంత్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more