భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ పై ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2012 నాటి కేసులో కోర్టు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న ఆయనపై ఈ మేరకు న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది.
ఆయనతోపాటు మరో 8 మంది ప్రజాప్రతినిధులకు కూడా ఎన్బీడబ్యూలు జారీ చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2012లో నమోదైన కేసులో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న నేతలు న్యాయస్థానాలకు హాజరు కాకపోవడంతో వేచి చూసిన న్యాయస్థానం ఎట్టకేలకు ప్రజాప్రతినిధులై వుండి న్యాయస్థానంలో పెండింగ్ లో వన్న కేసుల విచారణకు గైర్హజరవుతున్న నేతలపై నాన్ బెయిలేబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం పతాకస్థాయిలోకి చేరిన నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ పిలుపు మేరకు రైల్ రోకో కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగా వినయ్ భాస్కర్ సహా మరికొందరు ప్రజాప్రతినిధులు కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు రోకో కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్పట్లో వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరుపుతోంది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారెవరూ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తాజాగా, వారందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more