SC forms panel to hold talks, stays farm laws వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Supreme court stays implementation of farm laws forms panel to hold talks

India, Farmers, shut malls, shut petrol bunks, Supreme Court, resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

The Supreme Court suspended the implementation of three controversial farm laws, terming its order the 'victory for fair play'. 'If there is a victory at all, it is the victory of fair play,' Chief Justice of India (CJI) Sharad A. Bobde corrected senior advocate Harish Salve. The CJI was responding to an apprehension expressed by Mr. Salve that the stay on the implementation of the laws should not be misconstrued by some as a 'political victory' of sorts.

వ్యవసాయ చట్టాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు

Posted: 01/12/2021 09:28 PM IST
Supreme court stays implementation of farm laws forms panel to hold talks

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా పలు పిటీషన్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందకు రాగా, వీటిపై విచారించిన న్యాయస్థానం కేంద్ర తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. ఈ చట్టాలను మీరు పక్కన బెడతారా,; లేక మమల్నే ఆ పని చేయమంటారా? అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించిన 24 గంటల వ్యవధిలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ మూడు నూతన చట్టాల అమలుపై స్టే విధిస్తూ తాజాగా అదేశాలను జారీ చేసింది.

తాము తదుపరి అదేశాలు జారీ చేసే వరకు స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది. ఇక ఇదే సమయంలో రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జితేందర్ సింగ్ మాన్, ఇంటర్నేషనల్ పాలసీ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అగ్నికల్చరల్ ఎకనామిస్ట్ అశోక్ గులాటి, మహారాష్ట్రకు చెందిన శివ్ కేరి సంఘటన నేత అనిల్ ధన్వంత్ కమిటీ సభ్యులుగా ఉంటారని న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానానికి వున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను జఠిలం కాకుండా పరిష్కార మార్గం చూపేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని ప్రధాన న్యాయమూర్తి ఏస్ఎ బోబ్డే పేర్కోన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్లపై ఇవాళ విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని న్యాయస్థాన ధర్మాసనం ఈ మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే అంశాన్ని పరిగణలోకి తీసుకుని తమకున్న విశిష్ట అధికారల పరిధిలో సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

కాగా, రైతుల న్యాయస్థానాలు ఏర్పాటు చేసే ఏ కమిటీ ఎదుట హాజరై తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్దంగా లేరని అన్నదాతల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇక తమతో చర్చలు అనేక మంది వస్తున్నారని.. కానీ ప్రధాన మంత్రి మోడీ మాత్రం రావడం లేదని రైతులు భావిస్తున్నారని, ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రధానిని చర్చలకు వెళ్లమని చెప్పలేమని న్యాయస్థానం పేర్కోంది. రైతుల నిరసనలకు నిషేదిత సంస్థ సహకరిస్తోందంటూ దాఖలైన పిటీషన్ పై ప్రభుత్వ వాదనలు వినిపించే అటర్నీ జనరల్ ను న్యాయస్థానం సూటిగా ప్రశ్నించగా, ఖలిస్తానీలు నిరసనల్లో చొరబడ్డారని మాత్రమే తాము న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని భావించామని కేకె వేణుగోపాల్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles