కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తినలో రైతన్నల ఉద్యమం ఊపందుకున్న వేళ.. ఎనమిది విడతలుగా కేంద్రం అన్నదాతలతో చర్చలు జరిపినా.. అడుగుముందుకు పడక,. ప్రతిష్టంభన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా, అనుకూలంగా పలు పిటీషన్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందకు రాగా, వీటిపై విచారించిన న్యాయస్థానం కేంద్ర తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ .. ఈ చట్టాలను మీరు పక్కన బెడతారా,; లేక మమల్నే ఆ పని చేయమంటారా? అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ప్రశ్నించిన 24 గంటల వ్యవధిలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ మూడు నూతన చట్టాల అమలుపై స్టే విధిస్తూ తాజాగా అదేశాలను జారీ చేసింది.
తాము తదుపరి అదేశాలు జారీ చేసే వరకు స్టే కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది. ఇక ఇదే సమయంలో రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జితేందర్ సింగ్ మాన్, ఇంటర్నేషనల్ పాలసీ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అగ్నికల్చరల్ ఎకనామిస్ట్ అశోక్ గులాటి, మహారాష్ట్రకు చెందిన శివ్ కేరి సంఘటన నేత అనిల్ ధన్వంత్ కమిటీ సభ్యులుగా ఉంటారని న్యాయస్థానం పేర్కొంది. న్యాయస్థానానికి వున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను జఠిలం కాకుండా పరిష్కార మార్గం చూపేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని ప్రధాన న్యాయమూర్తి ఏస్ఎ బోబ్డే పేర్కోన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటీషన్లపై ఇవాళ విచారణ జరిపిన సీజేఐ నేతృత్వంలోని న్యాయస్థాన ధర్మాసనం ఈ మేరకు తాము చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే అంశాన్ని పరిగణలోకి తీసుకుని తమకున్న విశిష్ట అధికారల పరిధిలో సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
కాగా, రైతుల న్యాయస్థానాలు ఏర్పాటు చేసే ఏ కమిటీ ఎదుట హాజరై తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్దంగా లేరని అన్నదాతల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఇక తమతో చర్చలు అనేక మంది వస్తున్నారని.. కానీ ప్రధాన మంత్రి మోడీ మాత్రం రావడం లేదని రైతులు భావిస్తున్నారని, ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రధానిని చర్చలకు వెళ్లమని చెప్పలేమని న్యాయస్థానం పేర్కోంది. రైతుల నిరసనలకు నిషేదిత సంస్థ సహకరిస్తోందంటూ దాఖలైన పిటీషన్ పై ప్రభుత్వ వాదనలు వినిపించే అటర్నీ జనరల్ ను న్యాయస్థానం సూటిగా ప్రశ్నించగా, ఖలిస్తానీలు నిరసనల్లో చొరబడ్డారని మాత్రమే తాము న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని భావించామని కేకె వేణుగోపాల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more