(Image source from: Telugubulletin.com)
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలపై దాడులకు చెక్ పడటం లేదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై ఓ వైపు రాస్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్ని ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చిన తరుణంలో తాజాగా మరో దేవాలయంలోనూ దేవతా విగ్రహాల ధ్వంసం కోనసాగింది. బీజేపి, జనసేన పార్టీలు రామతీర్థం ధర్మయాత్రను చేపట్టడం.. అందుకు పోలీసులు అనుమతిన నిరాకరించడం.. ఈ క్రమంలో అరెస్టులు, పోలీసులకు బీజేపి, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన కలకలం రేపింది.
ప్రకాశం జిల్లాలోని సింగరాయ కొండ మండలంలోని పాత సింగరాయకొండలో చారిత్రక నేపథ్యమున్న దేవాలయాన్ని దుండగలు టార్గెట్ చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయులు నిర్మించిన దేవాలయం.. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిచెందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని టార్గెట్ చేసిన దుండగులు.. ఆలయానికి వెళ్లే ముఖ ద్వారం (కమాన్)పై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ, శ్రీ గరుత్మంతుడు మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో దేవతామూర్తుల విగ్రహాల చేతులు విరిగిపోయాయి. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ముఖద్వారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి దాడి జరగలేదని నిర్ధారించారు. దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్మించిన ముఖద్వారం కావడంతో సిమెంట్ పెచ్చులు విరిగిపడ్డట్లు తేల్చారు. ఇక ఆ ప్రాంతమంతా అదుపులోకి తీసుకుని బందోబస్తు నిర్వహించారు. ప్రకాశం జిల్లా అదనపు ఎస్సీ బి.రవిచంద్ర ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహాలు ధ్వంసం చేశారంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ఆలయ ఈవో బైరాగి కూడా ఇది దుండగులు చేసిన పనిగా నిర్థారించలేదు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more