(Image source from: Telugubulletin.com)
ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలపై దాడులకు చెక్ పడటం లేదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై ఓ వైపు రాస్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్ని ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చిన తరుణంలో తాజాగా మరో దేవాలయంలోనూ దేవతా విగ్రహాల ధ్వంసం కోనసాగింది. బీజేపి, జనసేన పార్టీలు రామతీర్థం ధర్మయాత్రను చేపట్టడం.. అందుకు పోలీసులు అనుమతిన నిరాకరించడం.. ఈ క్రమంలో అరెస్టులు, పోలీసులకు బీజేపి, జనసేన శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన కలకలం రేపింది.
ప్రకాశం జిల్లాలోని సింగరాయ కొండ మండలంలోని పాత సింగరాయకొండలో చారిత్రక నేపథ్యమున్న దేవాలయాన్ని దుండగలు టార్గెట్ చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయులు నిర్మించిన దేవాలయం.. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిచెందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని టార్గెట్ చేసిన దుండగులు.. ఆలయానికి వెళ్లే ముఖ ద్వారం (కమాన్)పై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ, శ్రీ గరుత్మంతుడు మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో దేవతామూర్తుల విగ్రహాల చేతులు విరిగిపోయాయి. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ముఖద్వారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి దాడి జరగలేదని నిర్ధారించారు. దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్మించిన ముఖద్వారం కావడంతో సిమెంట్ పెచ్చులు విరిగిపడ్డట్లు తేల్చారు. ఇక ఆ ప్రాంతమంతా అదుపులోకి తీసుకుని బందోబస్తు నిర్వహించారు. ప్రకాశం జిల్లా అదనపు ఎస్సీ బి.రవిచంద్ర ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహాలు ధ్వంసం చేశారంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ఆలయ ఈవో బైరాగి కూడా ఇది దుండగులు చేసిన పనిగా నిర్థారించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more