అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు గన్ కల్చర్ చర్చనీయాంశంగా మారింది. ఎవరి వద్ద పడితే వారి వద్ద గన్ ఉండటం.. ఆమాయకుల ప్రాణాలకు బలవుతున్నాయి. అమెరికాలోని చికాగో నగరంలో తాజాగా జరిగిన కాల్పులలో హైదరాబాద్ నగరవాసిని ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. అగ్రరాజ్యంగా బాసిల్లుతున్న అమెరికాలో కొందరు స్థానికులు పరాయిదేశ ప్రజలను దొచుకోవడం పరిపాటిగా సాగుతోంది. పొట్టచేత బట్టుకుని దేశం కాని దేశానికి వలసవచ్చిన వలసవాదులను చూసి వారు అప్పటికప్పుడు దొంగతనాలకు స్కెచ్ వేస్తుంటారు. పరాయిదేశ ప్రజల చేతుల్లో ఏ ఖరీదైన వస్తువు కనిపించినా.. దాని తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడి లాక్కోవడం అలవాటుగా మారింది.
దానిని ఇచ్చేందుకు నిరాకరించినా.. లేక ఏ మాత్రం కదిలినా విఛక్షణ కోల్పోయి దుండగులు కాల్పులకు తెగబడతారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ఎందరో. ఐ పోన్ల కోసం, ఐ ప్యాడ్ ల కోసం కూడా కాల్పులకు తెగబడిన ఘటనలు వున్నాయి. ఆ కాల్పుల్లో మరణించిన వారు వున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ కు చెందిన మహ్మద్ ముజీబుద్దీన్ పై అమెరికాలో కాల్పులు జరిగాయి. ఆయన తలకు బుల్లెట్ గాయమైంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2016లో అమెరికా వెళ్లి ముజీబ్ అక్కడ ఉద్యోగం చేస్తుండగా, ఆయన భార్య అఫ్రోజ్ కౌసర్, ఇద్దరు కుమారులు, కుమార్తెలు సంతోష్నగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.
భారత కాలమానం ప్రకారం ఇల్లినాయిస్ లో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ముజీబ్ తలకు తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో ఇంటికి వస్తానని మొన్ననే ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే ఇలా జరిగిందంటూ భార్య కౌసర్ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, తన బాధితుడు తీవ్ర ప్రాణాపాయస్థితిలో వున్నాడని.. అతనికి వెంటనే సాయం చేయాలని బాదితుడి కుటుంబం తరుపున ఎంబిటి పార్టీ నాయకుడు అంజదుల్లా ఖాన్ భారత విదేశాంగశాఖకు లేఖ రాశారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more