కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వున్న సుప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలల్లో భక్తుల కోసం ద్వారాలు తెరుచుకున్నా.. కోవిడ్ నేపథ్యంలో అంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. కేరళ శబరిమల కొండల్లో నెలవైన అయ్యప్ప స్వామి భక్తులకూ ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. మలయాళ నూతన సంవత్సరం విస్సు సందర్బంగా ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం మూసివేసిన ఆయ్యప్ప స్వామి దేవాలయం ఆ తరువాత నవంబర్ 16 నుంచి మండల పూజ సందర్భంగా తెరుచుకున్నాయి. అయితే అప్పట్నించే భక్తులకు స్వామివారిని దర్శించే అవకాశం లభించినా.. కేవలం పరిమితి సంఖ్యలోనే భక్తులను కొండపైకి అనుమతించారు.
తొలుత నవంబర్ లో రోజుకు కేవలం 250 మందికి మాత్రమే దర్శనానికి అనుమతించిన అధికారులు.. ఆ తరువాత సంఖ్యను 1000 మందికి, వారాంతాల్లో 2 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించారు. మరో పర్యాయం ఈ సంఖ్యను పెంచుతూ రెట్టింపు సంఖ్యలో భక్తులను అనుమతించారు. తరువాత ఏకంగా రోజుకు రెండు వేల మంది భక్తులతో పాటు వారాంతంలో 3 వేల మందిని స్వామి దర్శనానికి అనుమతించారు. ఇక తాజాగా ఈ సంఖ్యను మరింతగా పెంచుతూ కేరళ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంఖ్యలను రోజుకు ఐదు వేలకు పెంచుతూ న్యాయస్థానం అదేశాలను జారీ చేసింది. దీంతో ఇక ఇవాళ్టి నుంచి రోజుకు ఐదు వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించనుంది.
అయితే ఐదువేల మందిని శబరికొండపైకి అనుమతించినా.. అక్కడ నివసించేందుకు మాత్రం ఎవరికీ అనుమతి లేదని గతంలో జారీ చేసిన అన్ని అంక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. తప్పనిసరిగా వర్చువల్ క్యూలో వివరాలు నమోదు చేసుకున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇదిలావుండగా, అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం పక్కా మార్గదర్శకాలను రూపొందించారు ఆలయాధికారులు. దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిబంధన పెట్టారు. పంబ చేరిన తరువాత అక్కడి పిసీఆర్ లో భక్తులు కోవిడ్ నెగిటివ్ నిర్థారణ సర్టిఫికేల్ సమర్పించాలని పేర్కోన్నారు.
కోవిడ్ లేదని నిర్థారించిన నివేదిక ఉన్న భక్తులను మాత్రమే కొండపైకి అనుమతిస్తామని తెలిపారు. కాగా ఇంతకుముందు కేవలం యాంటీజెన్ టెస్టులో పరీక్ష రిపోర్టు ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించారు. కానీ, డిసెంబర్ 31 నుంచి జనవరి 19 వరకు జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) పండుగ వేళ నెగటివ్ రిపోర్టు(RTPCR) లేని భక్తలను కొండపైకి అనుమతించమని టీబీడీ బోర్డు అధ్యక్షుడు స్పష్టంచేశారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకొన్నట్టుగా ఉన్న కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. అలాగే 10 సంవత్సరాల లోపు చిన్నారులు, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించడం లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more