కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇచ్చిన ఓ వైపు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కేంద్రం రైతు వ్యతిరేక చట్టాల అమలుపై న్యాయపోరాటానికి కూడా దిగాయి, ఇదివరకే రైతులకు మద్దతుగా పలువురు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించగా, ఇక తాజా పరిణామాల నేపథ్యంలో రైతులు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ (బికేయు) కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టింది. కార్పోరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి రైతుల జీవనాన్ని కూడా దెబ్బతీసేలా వున్న వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం పిటీషన్ దాఖలు చేసింది.
కార్పోరేట్లకు అన్ని రంగాలలో తలుపులు తెరిచింది, ఇక తాజాగా వ్యవసాయ రంగంలోనూ వారికి రెడ్ కార్పెట్ పరిచేందుకు కేంద్రం ఈ వ్యవసాయ బిల్లును హడావిడీగా అమోదించిందని పేర్కోన్నారు, ఈ చట్టాలపై పూర్తిస్థాయిలో చర్చ జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందన్నారు. వ్యవసాయ రంగంలోకి కార్పోరేట్ సంస్థలు అడుగుపెడితే.. వారి స్వార్థపు అలోచలు, అత్యాశకు పుడమితల్లినే నమ్మకుని జీవిస్తున్న తమ బతుకులు చిధ్రం అవుతాయని రైతులు తమ పిటీషన్లలో పేర్కోన్నారు, కాగా.. వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గతంలో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెడుతున్న రైతన్నకు అండగా ప్రజలు నిలుస్తున్నా.. కేంద్రం మాత్రం చర్చలతో కాలయాపన చేస్తూనే తమ డిమాండ్లను అంగీకరించకుండా అడ్డుతగులుతోందన్నారు. తక్షణం కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, అప్పటి వరకు తమ నిరసనలు కోనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు తేల్చి చెబుతున్నారు. దేశానికి రైతు వెన్నుముక్క అని చెబుతూనే రైతు వెన్నునే విరిచే ప్రయత్నం జరుగుతోందని, దీనిని యావత్ దేశం ఖండించాల్సిన అవసరం వుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more