(Image source from: Timesofindia.indiatimes.com)
ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభన కోనసాగుతున్న తరుణంలో.. ప్రజలందరూ అప్రమత్తంగా వున్న నేపథ్యంలోనే మరో అంతుచిక్కని మహమ్మారి ఏకంగా మూడువందలకు పైగా స్థానికులను తమ కబంధహస్తాలలో పట్టించి బాధితులుగా మార్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే కోవిడ్ బారిన పడి వేలాది మంది చికిత్సపొంది కోలుకోగా వందలాది మంది అసువులు బాసారు. ఈ క్రమంలోనే మరో అంతుచిక్కని వ్యాధి స్థానికులను కబళిస్తుండటంతో అక్కడి వారిలో తీవ్ర కలవరం రేగుతోంది. శనివారం నుంచి అకస్మికంగా ఈ వ్యాధిబారిన పడుతున్న స్థానికుల సంఖ్య నిన్న రాత్రి వరకు ఏకంగా 300ల మించి నమోదైంది.
శనివారం రోజన ఏకంగా 108 మంది అసుపత్రిలో చేరగా నిన్న 209 మంది ఈ గుర్తుతెలియని వ్యాధి బారిన పడ్డారు. కాగా వీరిలో 180 మంది రోగులు త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య, అరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అపస్మారక స్థితిలోకి చేరుకుని ఆసుపత్రికి వచ్చిన శ్రీధర్ (45) మరణించడం కూడా కలవరాన్ని రేపుతోంది. ఈ వింతవ్యాధి బారిన పడిన వందలాది మంది అసుపత్రులకు చేరుకుంటున్నా.. ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధి బారిన పడుతున్నవారిలో అత్యధికులు 20 నుంచి 30 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. అయితే ఈ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తీవ్ర కలవరం రేకెత్తుతోంది.
అయితే ఏకంగా 12 ఏళ్లు వారితో పాటు అటు నలభై ఏళ్లకు పైబడిన వారు కూడా బాధితుల్లో వున్నారు. రక్తపోటు, షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఎలాంటి రోగాల బారిన పడనివారు కూడా ఈ వింత వ్యాధిబారిన పడుతూ ఆసుపత్రులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరులోని తాపీమేస్త్రీ కాలనీ, పడమరవీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగెళ్లమూడి, శనివారం పేట, అదివారపు పేట, అరుంధతీపేట ప్రాంతాలవారు శనివారం ఈ వ్యాధిబారిన పడగా, ఆదివారం రోజున ఇందిరమ్మ కాలనీ, మారడాన్ని రంగారావు కాలనీ, వైఎస్పార్ కాలనీల నుంచి ముగ్గురు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గీతాప్రసాదిని ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులో వుంటూ చికిత్స చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more