Mystery Illness Sweeps Through Eluru, Infects Over 300 అంతుచిక్కని రోగం.. ఏటూరులో కలవరం.. వైద్యవర్గాలకూ చిక్కని కారణం..

Mystery illness sweeps through india infecting over 300 people this weekend

India, Health, epidermic, mystery illness, coronavirus, eluru, Andhra Pradesh, nausea, seizures, unconscious, symptoms, coivd-19

As per the reports, around 300 people have reported symptoms of the unknown disease in the Eluru region in Andhra Pradesh. Of the 300 infected, around 140 were later admitted to the hospital because of the concerning symptoms. According to doctors, these include nausea, seizures, and even falling unconscious.

అంతుచిక్కని రోగం.. ఏటూరులో కలవరం.. వైద్యవర్గాలకూ చిక్కని కారణం..

Posted: 12/07/2020 04:28 PM IST
Mystery illness sweeps through india infecting over 300 people this weekend

(Image source from: Timesofindia.indiatimes.com)

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభన కోనసాగుతున్న తరుణంలో.. ప్రజలందరూ అప్రమత్తంగా వున్న నేపథ్యంలోనే మరో అంతుచిక్కని మహమ్మారి ఏకంగా మూడువందలకు పైగా స్థానికులను తమ కబంధహస్తాలలో పట్టించి బాధితులుగా మార్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే కోవిడ్ బారిన పడి వేలాది మంది చికిత్సపొంది కోలుకోగా వందలాది మంది అసువులు బాసారు. ఈ క్రమంలోనే మరో అంతుచిక్కని వ్యాధి స్థానికులను కబళిస్తుండటంతో అక్కడి వారిలో తీవ్ర కలవరం రేగుతోంది. శనివారం నుంచి అకస్మికంగా ఈ వ్యాధిబారిన పడుతున్న స్థానికుల సంఖ్య నిన్న రాత్రి వరకు ఏకంగా 300ల మించి నమోదైంది.

శనివారం రోజన ఏకంగా 108 మంది అసుపత్రిలో చేరగా నిన్న 209 మంది ఈ గుర్తుతెలియని వ్యాధి బారిన పడ్డారు. కాగా వీరిలో 180 మంది రోగులు త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య, అరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అపస్మారక స్థితిలోకి చేరుకుని ఆసుపత్రికి వచ్చిన శ్రీధర్ (45) మరణించడం కూడా కలవరాన్ని రేపుతోంది. ఈ వింతవ్యాధి బారిన పడిన వందలాది మంది అసుపత్రులకు చేరుకుంటున్నా.. ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధి బారిన పడుతున్నవారిలో అత్యధికులు 20 నుంచి 30 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. అయితే ఈ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తీవ్ర కలవరం రేకెత్తుతోంది.

అయితే ఏకంగా 12 ఏళ్లు వారితో పాటు అటు నలభై ఏళ్లకు పైబడిన వారు కూడా బాధితుల్లో వున్నారు. రక్తపోటు, షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఎలాంటి రోగాల బారిన పడనివారు కూడా ఈ వింత వ్యాధిబారిన పడుతూ ఆసుపత్రులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరులోని తాపీమేస్త్రీ కాలనీ, పడమరవీధి, కొత్తపేట, అశోక్ నగర్, తంగెళ్లమూడి, శనివారం పేట, అదివారపు పేట, అరుంధతీపేట ప్రాంతాలవారు శనివారం ఈ వ్యాధిబారిన పడగా, ఆదివారం రోజున ఇందిరమ్మ కాలనీ, మారడాన్ని రంగారావు కాలనీ, వైఎస్పార్ కాలనీల నుంచి ముగ్గురు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గీతాప్రసాదిని ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులో వుంటూ చికిత్స చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Health  epidermic  mystery illness  coronavirus  eluru  Andhra Pradesh  nausea  seizures  unconscious  symptoms  coivd-19  

Other Articles