Cyclone Nivar to landfall in TN, PM assures help తీవ్ర తుపానుగా తీరం దాటనున్న 'నివర్'

Cyclone nivar heavy rains to lash tn strong winds likely to cause damages

Cyclone Nivar: Heavy rains to lash TN, strong winds likely to cause damages, Cyclone Nivar, Heavy rains to lash TN, Strong winds likely to cause damages, Damages, Cyclone Nivar, Cyclone in Tamil Nadu, Karaikal,Chennai weather, Chennai Storm, Cyclone Nivar, Nivar cyclone, Cyclone Gaja, Landfall of Nivar cyclone, Tamil Nadu, Puducherry, Karaikal, Heavy rains, Very heavy rainfall, Weather update, Climate, Rainfall status, Rain in Chennai, Rain in Tamil Nadu

Many parts of Tamil Nadu, especially delta districts and northern coastal regions, are expected to receive extremely heavy rainfall over the next two days, due to the formation of Cyclone Nivar that will make landfall on November 25.

ముంచుకొస్తున్న ముప్పు: తీవ్ర తుపానుగా తీరం దాటనున్న ‘నివర్’

Posted: 11/24/2020 02:17 PM IST
Cyclone nivar heavy rains to lash tn strong winds likely to cause damages

(Image source from: Twitter.com/ANI)

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా నివర్ తుఫాను పంజా విసరనుంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కోనసాగుతున్న నివర్.. మరో 12 గంటల సమయంలో తుపానుగా రూపాంతరం చెందనుందని, ఆ తరువాత మరో 24 గంటల వ్యవధిలో అది తీవ్ర తుపానుగా మారి తీరం దాటనుందని చెన్నైలోని ప్రాంతీయవాతావరణ శాఖ హచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 25వ తేదీ సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు వున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ప్రస్తుతం నివర్ తుఫాను పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక తీవ్ర తుపానుగా మారి నివర్ తీరం దాటనున్న నేపథ్యంలో అక్కడి భయానక వాతావరణం అలుముకోనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏకంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదరుగాలులు వీస్తాయని, దీంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షలు కూడా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను తీరం దాటనున్న సమయంలో తమిళనాడు, పుద్దుచ్చేరిలోని తీర ప్రాంత లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చోచ్చుకువచ్చే ముప్పు కూడా వుందని వాతావరణ శాఖ తెలిపింది.

తమిళనాడులోని కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరింపజేసింది. దీంతో పాటు తీరం దాటనున్న తమిళనాడు తీరప్రాంతంలో రెండు కోస్టుగార్డు నౌకలను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. నివర్ తుఫాను కారణంగా ఇవాళ్టి నుంచే తమిళనాడులోని కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు, ఇక తీరం దాటిన తరువాత తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు, ఇప్పుడే సముద్రం అల్లకల్లోంగా వుందని.. తీరం దాటే సమయానికి ఇది మరింత ఉదృతంగా మారనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles