దీపావళి పండుగకు సరిగ్గా రెండు రోజుల ముందు రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అదేశాలు జారీ చేయడంతో దీనిపై తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ఇవాళ మధ్యహ్నం విచారణకు రానుంది. ఇదిలావుండగా, రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలను నిషేధిస్తూ జీవోను జారీ చేసింది. తాము రాష్ట్ర హైకోర్టు అదేశాలను ఫాలో అవుతున్నామని ప్రభుత్వం తెలుపకనే తెలిసింది.
రాష్ట్రంలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్రోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో పాటు తమ అదేశాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో కరోనా ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితుల్లో బాణాసంచాను కాల్చడం సరైంది కాదని విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలను నిషేధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అలుముకున్న తరుణంలో బాణాసంచా పేలుళ్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలను జారీ చేసింది, కోవిడ్-19 కారణంగా కాలుష్యం పెరిగి కరోనా బాధితులపై తీవ్ర ప్రబావం చూపుతుందని పిటీషనర్ న్యాయవాది ఇంద్రప్రకాశ్ వేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం పిటీషనర్ వాదనలతో ఏకీభవించింది. అంతరేముందు బాణాసంచా పేలుళ్ల నిషేదంపై ప్రభుత్వ వైఖరి ఏమిటని అడ్వోకేట్ జనరల్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. కాగా బాణాసంచా పేలుళ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ధిష్ట విధానాన్ని రూపోందించలేదని.. అయితే కరోనా నేపథ్యంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలు పాటిస్తూ.. అందుకు అనుగూణంగా ఆంక్షలు విధిస్తామని వివరించారు.
అయితే రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు అనేక మంది సంబంధిత అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నారని, ఇక అమ్మకాలు కోనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అందులోనూ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రజలందరినీ అప్రమత్తం చేసి బాణాసంచా కోనుగోళ్లు చేసేందుకు సమయం కూడా సరిపోదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు, కాగా, బాణాసంచా అమ్మకాలు, కాల్చడాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచాపై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందనే అంశాలు, కారణాలతో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని నివేదిక రూపంలో ఈ నెల 19న అందించాలని అడ్వొకేట్ జనరల్ ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more